మురళీ శర్మ… టాలీవుడ్లో ది బెస్ట్ పర్ఫార్మర్స్లో ఆయన ఒకడు. అసలు మురళీ శర్మ కోసం కొత్తగా మేకర్స్ పాత్రలు క్రియేట్ చేస్తున్నారంటే ఆయన రేంజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే అయితే ముందుగా టీవీ సీరియల్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన మురళి శర్మ.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో విలన్ పాత్రతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.ఈ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ? మురళీ శర్మ సతీమణి సైతం తోపు నటి.

అవును.. హీందీలో ఇప్పుడు అనేక సీరియల్స్ చేస్తుంది. మురళీ శర్మ భార్య పేరు అశ్వినీ కల్ శేఖర్. అల్లు అర్జున్, తమన్నా కాంబోలో వచ్చిన బద్రినాథ్ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా కనిపించింది. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది.
ఇప్పుడు మరాఠీ, హిందీ సినిమాలు, సీరియల్స్ చేస్తున్నారు. తెలుగులో బద్రినాథ్, నిప్పు సినిమాలతోపాటు మోహబూబా చిత్రంలోనూ కనిపించారు. ప్రస్తుతం హిందీ బుల్లితెరపై బిజీగా ఉన్నారు.