మోహిని తెలుగులో కంటే తమిళ్లో మంచి ఆదరణపొందింది. చెప్పాలంటే 90వ దశకంలో మంచి ఖ్యాతి గడించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు కనుమరుగైన నటీమణుల్లో ఆమె ఒకరు. అయితే చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ఇప్పటికీ సినీపరిశ్రమలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. టాప్ హీరోయిన్స్ అవుతారనుకున్న తారలు అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పెళ్లి, భర్త, పిల్లలతో ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు.
అందులో మహాలక్ష్మి శ్రీనివాసన్ ఒకరు. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. హీరోయిన్ మోహిని అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. కథానాయికగా తెరంగేట్రం చేసిన తర్వాత తన పేరును మోహిని శ్రీనివాసన్ గా మార్చుకున్నారు. 90లలో ఆమె అగ్ర కథానాయిక. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించారు. మిళనాడులోని తంజావూరులో జన్మించి.. చెన్నైలోని చిల్డ్రన్స్ గార్డెన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించి.. ఆ తర్వాత 1991లో ఈరమన రోజావే సినిమాతో కథానాయికగా కనిపించింది. ఈ సినిమాకు రచన, దర్శకత్వం, నిర్మాత కెయార్. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో హిందీలో అభి అభి పేరుతో 1992లో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ మూవీ పెద్ద విజయాన్ని అందుకుంది. దీంతో మోహిని వెనుదిరిగి చూసుకోలేదు. నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ తర్వాత డిటెక్టివ్ నారధ, మామ బాగున్నావ్, హిట్లర్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో అబ్బాయిల డ్రీమ్ గర్ల్ గా ఉన్న మోహినికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టిన సమయంలోనే ఆమె భరత్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొన్ని కారణాలతో భర్తకు విడాకులు ఇచ్చింది మోహిని. ప్రస్తుతం ఆమె అమెరికాలో క్రైస్తవ మత ప్రచారకురాలిగా మారిపోయింది.