సామాన్య భక్తురాలిలా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్, వైరల్ వీడియో.

divyaamedia@gmail.com
1 Min Read

హర్యానాలో పుట్టి పెరిగిన మీనాక్షి చౌదరి.. మిస్ ఇండియా హర్యానా టైటిల్ గెలుచుకుంది. 2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ ఆమెకి దేవుళ్ళ పట్ల విశ్వాసం, భక్తి భావం చాలా ఎక్కువగా ఉన్నాయి.

అయితే ముద్దుగుమ్మ, సినీనటి, సంక్రాంతికి వచ్చేస్తున్నాం ఫేమ్ మీనాక్షి చౌదరి శ్రీశైలంలో మిల మిల మెరిసిపోయారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం భ్రమరాంబ దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పలువురు భక్తులు ఆమెను గుర్తించి సెల్ఫీలు తీసుకున్నారు.

ఆ తర్వాత పాతాళ గంగ బోట్ లో మీనాక్షి షికారు చేశారు. శ్రీశైలం ప్రకృతి అందాలకు పరవశించిపోయారు. ఎవరికి తెలియకుండా రావడంతో ఎలాంటి హడావుడి లేదు. ప్రస్తుతం మీనాక్షి శ్రీశైలం ఆలయ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. సంక్రాంతికి వచ్చేస్తున్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *