మీనా.. బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి దక్షిణాదిలో అగ్ర కథానాయికగా చెలామణి అయింది. ఇటీవలే ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి ఏకైక కుమార్తె నైనికతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. కొన్ని కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇటువంటి తరుణంలో మీనా పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అయితే సినిమాలు చేస్తున్న సమయంలోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ని..పెళ్లి చేసుకున్న మీనాకు ఒక పాప కూడా ఉంది. అయితే కరోనా సమయంలో మీనా భర్త మరణించారు. ప్రస్తుతం తన కూతురితో తన జీవితాన్ని కొనసాగిస్తుంది మీనా. కుమార్తె నైనిక ఎదుగుదల కోసం ఆమె అన్ని బాధ్యతలు స్వయంగా తీసుకున్నారు. ఇక మీనా కూతురు విజయ్ తేరీ సినిమాలో కూడా కనిపించింది.

అయితే గత కొద్ది రోజులగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్త తెగ వైరల్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా కోలీవుడ్ నటుడు ధనుష్ పేరు తెరపైకి రావడం గాసిప్స్కు ఊపునిచ్చింది. ధనుష్ ఇప్పటికే తన భార్య ఐశ్వర్యతో విడిపోయిన నేపథ్యంలో, మీనాతో అతనికి సంబంధం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మీనా ఇంతకు ముందు కూడా స్పందిస్తూ వాటిని తిప్పికొట్టారు.
ఈ క్రమంలో..సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీనాపై వస్తున్న ప్రచారాలను పరోక్షంగా సమర్థించారు. వ్యక్తిగత జీవితంలో ఎవరికైనా కొత్త ప్రారంభాలు సాధారణమేనని, మీనా పెళ్లి చేసినా అది ఆశ్చర్యం కాదు అని అభిప్రాయపడ్డారు. మీనాకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉందని చెప్పారు.