బ్యాచిలర్స్ కు గుడ్ న్యూస్, పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఆఫర్ చేస్తున్న ప్రభుత్వం. ఎందుకంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

కాలం మారుతున్న కొద్ది మన దేశంలో కూడా పెళ్లి బంధం బలహీనం అవుతుంది. విడాకులు తీసుకునే దంపతుల సంఖ్య పెరుగుతుంది. ఇక పెరుగుతున్న ఆర్థిక ఖర్చులు, ఇతర సమస్యల కారణంగా నేటి కాలం యువత.. పెళ్లి అంటేనే విముఖత చూపుతున్నారు. కాదంటే.. 30 ఏళ్ల తర్వాతనే పెళ్లి చేసుకుంటామంటున్నారు. ఇక కొన్ని దేశాల్లో అయితే యువత పెళ్లి వద్దు సింగిల్‌ లైఫ్‌ ముద్దు అంటున్నారు.

అయితే ఆసియా దేశమైన దక్షిణ కొరియాలో పెళ్లి చేసుకునే జంటలకు ప్రభుత్వం రూ.31 లక్షలు ఇస్తోంది. దీనికి కారణం.. పెళ్లిళ్లను ప్రోత్సహించడమే అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు. పిల్లలు పుడితే వారికోసం భారీగా ఖర్చు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఎందుకంటే.. దక్షిణ కొరియాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో కొత్త జంటలు పెళ్లి చేసుకుని, ఎక్కువ మంది పిల్లలను కనాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

దక్షిణ కొరియాలోని బూసన్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెళ్లి చేసుకునే జంటలకు 38,000 డాలర్లు (రూ.31 లక్షలు) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ కొరియా జనాభా వేగంగా తగ్గిపోతోంది. అక్కడ ప్రతి మహిలా సగటున 0.72 మంది పిల్లలను మాత్రమే కంటున్నారు. అంటే, ఒక మహిళ ఒక బిడ్డను కూడా కనడం లేదని తెలుస్తుంది. దీంతో జనాభా పెరుగుదల, ప్రసూతి రేటును పెంచేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను అమలు చేస్తోంది.

దక్షిణ కొరియా జనాభా దాదాపు 5 కోట్లు మాత్రమే. అలాగే, జపాన్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దక్షిణ కొరియా మాదిరిగానే జపాన్ కూడా తక్కువ జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. గతంలో ఏడాదికి 50 లక్షలుగా ఉన్న జననాల రేటు.. ప్రస్తుతం 7.60 లక్షలకు పడిపోయింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *