పెళ్లిలో వరుడి ముఖం చూసి మూర్చపోయిన వధువు, ఎక్కడ జరిగిందో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే కోరికతో కొందరు వివిధ రకాలుగా పెళ్లి వేడుకను ప్లాన్ చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు అనుకోకుండా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, అలాంటిదే వెడ్డింగ్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

కల్యాణ మండపంలో పెళ్లికొడుకు పక్కనే ఉన్న పెళ్లి కూతురు ఉన్నట్టుండి ఏడుపు మొదలెట్టింది. అయితే సాధారణంగా మన తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చూపుల సమయంలోనే వధూవరులు ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత నచ్చితే పెళ్లి చేస్తారు. అయితే ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో వధూవరుల ముఖాలను పెళ్లి రోజే చూపిస్తారు.

ఆ సమయంలో వారికి ఒకరి ముఖాలు ఒకరికి నచ్చినా నచ్చకపోయినా చేసుకోవాల్సిందే. ఈ మధ్యకాలంలో ఈ సంప్రదాయన్ని కొందరు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇలాంటి ఘటనే ఓ ఉత్తర భారత ప్రాంతంలో చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో వధూవరులు దండలు మార్చుకోవాల్సి ఉంది. ఆ సమయంలో వధువు వరుడి ముఖం చూపించాలని కోరింది. ఇందుకు ముందు అతను ఒప్పుకోలేదు. ఏం ఫర్వాలేదు చూపించండి అని కోరింది.

అతను తన ముఖం చూపించగానే కళ్లు తిరిగి పడిపోయింది. కారణం అతను అందంగా లేక కాదు.. వధువు వయసు 20 ఏళ్లు కాగా.. వరుడి వయసు 69 సంవత్సరాలట. స్పృహ వచ్చాక ఈ పెళ్లి తనకు వద్దని.. తనలో ఏం లోపం ఉందని తనకు ఇంతటి ముసలోడిని ఇచ్చి చేస్తున్నారంటూ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *