ఏకంగా హోటల్ రూమ్‌లోనే.. యవ్వారం అంతా బయటపడిందిగా..! రాజ్‌ తరుణ్‌, మాల్వీ మెసెజ్‌ చాట్స్‌ లీక్‌.

divyaamedia@gmail.com
2 Min Read

తాజాగా లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రాల మధ్య జరిగిన వాట్సాప్‌ మెసేజ్‌లను రివీల్‌ చేసింది. వారిద్దరి మధ్య జరిగిన మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ చేసి.. మరిన్ని సంచలన విషయాలు తెర మీదకు తెచ్చింది. దీనిలో రాజ్‌ తరుణ్‌ మాల్వీకి ప్రపోజ్‌ చేయడం ఆమె దానికి అంగీకారం తెలపడం వంటి వివరాలు ఉన్నాయి. అలానే రాజ్‌ తరుణ్‌, మాల్వీల డేట్‌, మీటింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా దీనిలో బయటపడ్డాయి.

వారిద్దరూ ఏ హోటల్‌ రూమ్స్‌లో కలుసుకున్నారు.. వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రాజ్‌ తరుణ్‌ చెబుతూ రావడంతో ఇప్పుడిలా వారి మధ్య జరిగిన మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ కావడం సంచలనంగా మారింది. మాల్వి, రాజ్ తరుణ్‌పై లావణ్య కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య పెట్టిన కేసులో రాజ్ తరుణ్‌కి పోలీసులు నోటీసులు కూడా పంపారు.

గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. రాజ్ తరుణ్ రాలేదు. షూటింగ్స్, బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని రాజ్ తరుణ్ పోలీసులకు లేఖ రాసి తన లాయర్‌తో పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజుల గడువు కావాలని పోలీసులను కోరారు. ప్రేమించి తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను మోసం చేశాడంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

హీరోయిన్ మాల్వీ మల్హోత్ర కోసం తనను దూరం పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు హీరోయిన్ మాల్వీ సైతం లావణ్య పై కేసు పెట్టింది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్న తరుణంలో రాజ్ తరుణ్ తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. అబార్షన్ కూడా చేయించాడని.. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది లావణ్య. ఆ మధ్య ఆత్మహత్య ఆలోచన కూడా చేసింది లావణ్య.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *