శిల్పా శిరోద్కర్ వికిపిడియా ప్రకారం.. ఆమె 1989 నుంచే సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. 2000 సంవత్సరంలో సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత బరూద్ అనే సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడుతున్నారు.
ఇప్పటికే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ట్రావిడ్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ నటి ఈ మహమ్మారి బారిన పడింది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
‘మిత్రులారా! నాకు కొవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. మీరు జాగ్రత్తగా ఉండండి.. ముందు జాగ్రత్తగా మాస్క్ ను ధరించండి’ అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన బాలీవుడ్ సినీ పప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శిల్పా కు ధైర్యం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా తన సోదరి కరోనా బారిన పడిన విషయాన్ని తెలుసుకున్న నమ్రతా ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
ఈ మేరకు శిల్పా పోస్టుకు స్పందించిన ఆమె లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. నమ్రతాతో పాటు సోనాక్షిసిన్హా, సోనాలి బింద్రే, డయానా పాండే తదితర సినీ ప్రముఖలు శిల్పా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Stay Safe ♥️ pic.twitter.com/Hq5aqKjf5Z
— Shilpa shirodkar (@Shilpashirodkr) May 19, 2025