బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, అయేషాలకి స్పెషల్ టాస్క్ ఇచ్చారు. హౌస్లో వందల బెలూన్లు ఉంచి, వాటిని పగలగొడితే వచ్చే చీటీల ద్వారా నామినేషన్ ప్రాసెస్ కొనసాగించమన్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు 9 ఏడోవారం మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్లకి సంబంధించిన చర్చ జరిగింది. కళ్యాణ్ తనూజని కాకుండా సంజనాని నామినేట్ చేసిన నేపథ్యంలో కళ్యాణ్పై ఫైర్ అయ్యాడు ఇమ్మాన్యుయెల్. ఇది తనూజ వరకు వెళ్లింది. ఆమె తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫైర్ అయ్యింది.
వీళ్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ విషయంలోనే నువ్వు స్వీట్ పాయిజన్ అంటూ కామెంట్ చేసుకునే స్థాయికి వెళ్లింది. అటు తనూజ, ఇటు ఇమ్మాన్యుయెల్ రెచ్చిపోయారు. అంతేకాదు తనూజ ఒక అడుగుముందుకేసి ఆమెని ఎలిమినేట్ అయ్యాక కూడా మళ్లీ హౌజ్లోకి తీసుకొచ్చామని, ఆ విషయంలో తాము బుద్ది తెచ్చుకోవాల్సింది అని చెప్పింది. దీంతో తనకోసం కాఫీ త్యాగం చేశావని, కానీ ఆ తర్వాత తాగావని కౌంటర్ ఇచ్చింది సంజనా. కాసేపు హాట్ హాట్గా మాట్లాడుకున్నారు.

తర్వాత కూల్ అయ్యారు. ఇంకోవైపు ఇమ్మాన్యుయెల్ విషయంలో సంజనా ఎమోషనల్ అయ్యింది. తనకు అతను కొడుకులాగా అని తెలిపింది. తన బిడ్డని వదిలేసి షోకి వచ్చానని, బాబుని చూసుకోలేకపోతున్నానని, కానీ ఇమ్మాన్యుయెల్ ఓ కొడుకులా నవ్విస్తాడని, ఎంటర్టైన్ చేస్తున్నాడని, దీంతో కొడుకుని అతనిలో చూసుకుంటున్నానని తెలిపింది సంజనా. కాసేపు ఎమోషనల్ అయ్యింది. అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్లకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం హౌజ్ని రెండు గ్యాంగ్స్ గా చేశారు. ఒక గ్యాంగ్ కి సంజనా సైరెన్ లీడర్ అయితే, మరో గ్యాంగ్కి మాస్ మాధురీ లీడర్.
వీరిద్దరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. వీరు తమ టీమ్ సభ్యులను పెంచుకునే అవకాశం ఉంది. ఎవరి టీమ్లో ఎక్కువ సభ్యులు ఉంటారో వాళ్లు కెప్టెన్సీకి నేరుగా కంటెండర్గా మారతారని తెలిపారు. అదే సమయంలో ఏ కంటెస్టెంట్ వద్ద అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, వాళ్లు కంటెండర్కి అర్హత సాధిస్తారు. ఈ నియమం ప్రకారం హౌజ్ని రెండు గ్యాంగ్లుగా విడగొట్టాడు బిగ్ బాస్. తమ గ్యాంగ్లో ఉన్నదంతా దొంగలే. వాళ్లు విభిన్న వేషాధారణలో ఉన్నారు. చూడ్డానికి క్రేజ్గా, ఫన్నీగా ఉన్నారు. నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యారు.
అయితే ఇందులో ఇమ్మాన్యుయెల్ తనదైన స్టయిల్లో కామెడీ చేస్తూ నవ్వించడం విశేషం. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్.. మధురీపై షాకింగ్ కామెంట్లు చేశారు. సంజనా వైపు ఉండాల్సిన ఇమ్మాన్యుయెల్ కాసేపు మాధురీ వైపు తిరిగాడు. ఈ క్రమంలో ఆమె గొప్ప అంటూ నినాదాలు చేశారు. నోరు జారి మాధురీ అమరహే అంటూ కామెంట్ చేశాడు. వెంటనే దాన్ని సరి చేసుకున్నాడు. మరోవైపు సోమవారం ఉంటుంది నామినేషన్, మా అక్కతో పెట్టుకుంటే అయిపోతారు ఎలిమినేషన్ అంటూ నినాదం చేయడం హైలైట్గా నిలిచింది.
మాధురి టార్గెట్ చేసే వాళ్లు ఎలిమినేట్ అవుతారని ఇమ్మాన్యుయెల్ ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇదే అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా మంగళవారం ఎపిసోడ్ ఆద్యంతం ఫైరింగ్గా, ఎంటర్టైనింగ్గా ముగిసిందని చెప్పొచ్చు.
