పెళ్లయిన రెండేళ్ల తర్వాత లావణ్య త్రిపాఠి తీవ్ర విషాదంలో మునిగారు. తీవ్ర బాధపడుతూ సోషల్ మీడియాలో ఆమె కొన్ని ఫొటోలు పంచుకుంది. ఆమె ఆవేదనకు కారణంగా ఎంతగానో ఇష్టపడే పెంపుడు శునకం చనిపోయింది. దీంతో ఆమె తట్టుకోలేకపోతున్నది. అయితే మెగా కోడలు, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గత కొన్నేళ్ల నుంచి ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శునకం తాజాగా మరణించింది.
ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఎమోషనల్ అయింది. నేను ఇప్పటివరకు కలిసిన అత్యంత ముద్దుల కూతురు నువ్వు. నీకు వీలైతే నాకు టీ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తావని నేను అందరితో చెబుతుంటాను. నీది ఎంత అందమైన హృదయం, ఎంత తెలివైనదానివి..నువ్వు నిజంగా నాకు ప్రత్యేకమైనవాడివి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో స్వీటీ
అంటూ లావణ్య ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.

అలాగే తన పెట్ డాగ్ తో గడిపిన మధుర క్షణాలను ఫోటోల రూపంలో అందరితో పంచుకుంది. లావణ్య పోస్ట్కి నెటిజన్స్ రెస్ట్ ఇన్ పీస్
అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య దంపతులు ఈ గుడ్ న్యూస్ ఇటీవల స్వయంగా పంచుకున్నారు. ఇటువంటి టైమ్ లో పాపం లావణ్య తన పెట్ డాగ్ ను కోల్పోవడం అనేది నిజంగా విచారమే. ఈ బాధ నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.