హీరో జయం రవితో ఆర్తి విడాకుల గొడవ, భరణం కిందా నెలకు రూ.40 లక్షలు డిమాండ్.

divyaamedia@gmail.com
2 Min Read

జయం రవి – ఆర్తి వాదనలు విన్న కోర్టు.. రాజీ కోసం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించిందట. అయితే రవి మాత్రం ఆర్తితో బంధాన్ని కొనసాగించలేనని, విడాకులు కావాలని లీగల్‌ టీమ్‌ ద్వారా న్యాయస్థానాన్ని కోరాడట. దీంతో ఆర్తి తన భర్త నుంచి నెలకు ₹ 40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. అయితే మలయాళ ప్రముఖ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వివాదం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం వీరి విడాకుల దరఖాస్తు పై చెన్నై ఫ్యామిలీ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆర్తి విడాకుల తర్వాత తన భర్త రవి మోహన్ నుంచి నెలకు రూ. 40లక్షల అలిమోని (మెయింటెనెన్స్) డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల చెన్నె ఫ్యామిలీ కోర్టులో విచారణకు హాజరైన జయం రవి.. ఇకపై ఆర్తితో వైవాహిక బంధం కొనసాగించలేనని, విడాకులు మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరినట్లు సమాచారం.

దీంతో భార్య ఆర్తి నెలకి రూ. 40 లక్షలు నెలకి అలిమోనిగా ఇవ్వాలని కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసారు. జయం రవి – ఆర్తి 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి అయాన్, ఆరవ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, 2024లో తాను భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదిక ప్రకటించాడు. అయితే భార్య ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే రవి విడాకుల ప్రకటన చేశారని ఆరోపించింది.

ఈ నిర్ణయానికి తాను, పిల్లలు షాక్ అయ్యాం” అని పేర్కొన్నారు. కెనిషా ఫ్రాన్సిస్ అనే మహిళ రవి మోహన్ జీవితంలోకి రావడం వల్లే తమ వివాహం విచ్చిన్నమైందని ఆర్తి పబ్లిక్ గా పోస్ట్ పెట్టారు. మరోవైపు రవి “ఈ పెళ్లిలో తనకు మానసిక వేదన, ఒంటరితనం ఎక్కువయ్యాయి” అని ఆరోపణలు చేశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *