ఐశ్వర్య లక్ష్మి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది. ఐశ్వర్య 2014లో మోడల్ గా కెరీర్ ప్రారంభించి 2017లో మలయాళంలో విడుదలైన జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చింది. అయితే ఈ అమ్మడి సినిమా లైఫ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. కానీ ఈ ముద్దుగుమ్మ మెడిసిన్ చదివిందని చాలా మందికి తెలియదు. తిరువనంతపురంలో పుట్టి పెరిగిన ఆమె ఎర్నాకుళంలోని శ్రీ నారాయణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సేస్ లో మెడిసిన్ పూర్తి చేసింది.
చదువయ్యాక అక్కడే జూనియర్ డాక్టర్ గా ఇంటర్న్ షిప్ కూడా చేసింది. అదే సమయంలో నటనపై మక్కువ పెంచుకుంది. మొదట మోడలింగ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు బ్రాండ్స్ కు ప్రమోటర్ గా వ్యవహరించింది. యాడ్స్ లోనూ నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుంది.
ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార. ఆ మధ్యన జీవితంలో పెళ్లే చేసుకోనంటూ షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. మలయాళం, తమిళ భాషల్లో ఎక్కువగా నటించే ఐశ్వర్యా .. ‘గాడ్సే’తో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయింది. ఆ తర్వాత ‘అమ్ము’, ‘మట్టి కుస్తీ’ సినిమాలతో మెప్పించింది.
అలాగే మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లోనూ కీలక పాత్ర పోషించింది. ఇక దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతా, ఇటీవలే కమెడియన్ సూరితో కలిసి నటించిన మామన్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కేవలం నటనే గాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతోందీ అందాల తార. సాయి పల్లవి నటించిన ‘గార్గి’ నిర్మాతల్లో ఐశ్వర్య కూడా ఒకరు.