పాకిస్థాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పి కొట్టింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దాదాపు మూడు రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులకు శనివారం శనివారం సాయంత్రం నాటికి తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమ దౌత్యంతోనే ఇరు దేశాలకు కాల్పుల విమరణకు ఒప్పుకున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
అయితే కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లో మరోసారి దాడులకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ప్రాంతంలో పాక్ డ్రోన్ లు కనిపించాయి. అలాగే, అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా సెక్టార్లలో పాకిస్తాన్ కాల్పులు జరిపింది.

భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో మరోసారి కొత్త చర్చ మొదలైంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనల్లో బారాముల్లాలోలో జరిగిన దాడుడు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనతో దాడులకు తెగబడిన ప్రాంతాలు:- 1. ఉధంపూర్ 2. అఖ్నూర్ 3. నౌషెరా 4. పూంచ్ 5. రాజౌరి 6. మెంధర్ 7. జమ్మూ 8. సుందర్బాని 9. RS పురా 10. అర్నియా 11. కతువా.