హర్షవర్ధన్ రాణే ఒక భారతీయ చలన చిత్ర నటుడు. అతను ఎక్కువగా తెలుగు, హిందీ సినిమా లలో నటించెను. అతను తకిట తకిట,ప్రేమ ఇష్క్ కాదల్, నయనతార నటించిన అనామిక చిత్రాల ద్వారా పెరు పొందాడు. అయితే ఈ నటుడి డెడికేషన్ వేరే లెవెల్. ఒకవైపు సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే మరోవైపు శ్రద్దగా చదువుకుంటోన్న ఈ నటుడి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇలా 41 ఏళ్ల వయసులోనూ చదువు కోసం కష్టపడుతోన్న ఈ హీరో మరెవరో కాదు హర్షవర్ధన్ రాణే.
గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఇతను ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. హర్ష వర్ధన్ నటించిన సనమ్ మేరీ కసమ్ రీ రిలీజ్ లో ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్ లో ఇదొక కొత్త రికార్డు. ఈ నటుడు గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించాడు. తకిట తకిట సినిమాతో హీరోగా పరిచయమైన హర్షవర్ధన్, ఆ తర్వాత నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్, మాయ, ‘ఫిదా’, బెంగాల్ టైగర్, అవును, అవును 2, అనామిక, గీతాంజలి, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తదితర చిత్రాలలో నటించి మెప్పించారు.
ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం హర్షవర్ధన్ తన రాబోయే రొమాంటిక్ చిత్రం ‘దీవానియాత్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇంతలో, జూన్లో తనకు సైకాలజీ ఆనర్స్ రెండవ సంవత్సరం పరీక్షలు ఉన్నాయని, దాని కోసం తాను కష్టపడి చదువుతున్నానని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పంచుకున్నాడీ హీరో. అతను ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ‘సినిమా షూటింగ్ జరుగుతోంది, సైకాలజీ ఆనర్స్ రెండవ సంవత్సరం పరీక్షలు జూన్లో ఉన్నాయి’ అని రాసుకొచ్చాడు.
హీరో షేర్ చేసిన ఫోటోలలో, రాణే స్టడీ టేబుల్పై ఉంచిన నోట్స్ చదువుతూ కనిపించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హర్షవర్ధన్ ప్రస్తుతం సైకాలజీలో డిగ్రీ చదువుతున్నాడు. దీని గురించి సమాచారాన్ని ఇంతకు ముందు తన అభిమానులతో పంచుకున్నాడు.