తక్కువ సమయంలోనే అందం, అభినయంతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదు.. నాగార్జున నటించిన సంతోషం సినిమా హీరోయిన్ గ్రేసీ సింగ్. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియా, ప్రభుదేవా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నాగ్, గ్రేసీ సింగ్ జోడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది.
అయితే సంతోషం తర్వాత తప్పుచేసి పప్పుకూడు, రామ రామకృష్ణ కృష్ణ, రామ్ దేవ్ వంటి తెలుగు సినిమాల్లో నటించింది గ్రేసీ సింగ్. ఇక హిందీలో అయితే ‘లగాన్’, ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది. అయితే గ్రేసీ సింగ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఆధ్యాత్మిక శాంతిని వెతుక్కుంటూ, గ్రేసీ సింగ్ బ్రహ్మ కుమారీస్ సంస్థలో చేరింది.
ఆమె ఇప్పుడు ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాలలో క్రమం తప్పకుండా పాల్గొంటుంది. ధ్యానం, యోగా, సేవ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేస్తోంది.బ్రహ్మ కుమారీస్లో చేరిన తర్వాత, గ్రేసీ ఒక పోర్టల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, “నేను అపారమైన ఆనందం, శాంతిని పొందుతున్నాను’ అని చెప్పింది.గ్రేసీ శిక్షణ పొందిన భరతనాట్యం, ఒడిస్సీ నృత్యకారిణి. ఇప్పుడు బ్రహ్మ కుమారీస్ కార్యక్రమాల్లో కూడా తన నృత్యం ద్వారా ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తుంది.
గ్రేసీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఆమెకు 44 సంవత్సరాలు, ఆమె తన జీవితాన్ని ఇలాగే గడపడానికి ఇష్టపడుతుంది. గ్రేసీ చివరిగా సంతోషి మా సీరియల్ సీక్వెల్ ‘సంతోషి మా- సునేన్ వ్రత్ కథేన్’లో ఒక పాత్ర పోషించింది.