పేదలకు భారీ శుభవార్త, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండానే ఒక్క రూపాయికే సొంత ఇల్లు.

divyaamedia@gmail.com
2 Min Read

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదవారికి ఇంటి పట్టాతో పాటుగా నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పట్టాలను ఇస్తోంది. అయితే పేదవారి కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 60 గజాలలోపు ఇళ్లు నిర్మించుకునే వారికి ఇకపై మున్సిపల్ అనుమతులు అవసరం లేకుండా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం, కేవలం ఒక రూపాయి ఫీజుతో ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

అలాగే స్వయంగా ధృవీకరణ చేసుకోవచ్చు. దీన్నే ప్రభుత్వం సెల్ఫ్-సర్టిఫికేషన్ ప్రక్రియ అంటోంది. ఇందులో సర్టిఫికెట్లను స్వయంగా అప్‌లోడ్ చేసుకొని, స్వయంగా వాటిని ఆమోదించుకోవచ్చు. ఈ ప్రక్రియలో అధికారుల జోక్యం ఉండదు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారు.. ఇంటి నిర్మాణం ప్రారంభించవచ్చు. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప ఊరటను ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలు చూస్తే.. స్వీయ ధ్రువీకరణ విధానంలో భాగంగా.. 60 గజాలలోపు ఇళ్ల నిర్మాణానికి మున్సిపల్ లేదా టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.

అందువల్ల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. లంచాల మాటే ఉండదు. అందుకే ఇది పేదలకు భారీ శుభవార్తగా ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం ద్వారా, ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయడానికి ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది, ఇది డిసెంబర్ 31, 2024 నుంచి అమలులోకి వచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా, లబ్ధిదారులు తమ వివరాల్ని నమోదు చేసి, స్వీయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ (housing.ap.gov.in), ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ పోర్టల్ (aphousing.apcfss.in)లో ఈ వివరాలు ఉంటాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌లో, లబ్ధిదారులు తమ ఆధార్ వివరాలు, భూమి యాజమాన్య పత్రాలు, ఇంటి ప్లాన్ వివరాలను అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం ఒక రూపాయిగా నిర్ణయించారు. ఇది పేదలకు ఆర్థిక భారం లేకుండా చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా ఉండటం వల్ల, లబ్ధిదారులు ఇంటి నుంచే అన్ని పనులనూ పూర్తి చేయవచ్చు.

housing.ap.gov.in వెబ్‌సైట్‌లో “Mana Illu Mana Gouravam” లేదా హౌసింగ్ రిజిస్ట్రేషన్ సెక్షన్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. housing.ap.gov.in వెబ్‌సైట్‌లో ప్రభుత్వం నిరంతరం మార్పులు చేస్తోంది. మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే.. స్థానిక మున్సిపల్ కార్యాలయం లేదా హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించి, రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రక్రియ వివరాలు కోరవచ్చు. తద్వారా అధికారులే.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూపిస్తారు. అప్పుడు ఏదైనా సమస్య వస్తే, అధికారులు దగ్గరుండి సమస్యలను పరిష్కరిస్తారు. అలాగే.. 08663501300 ఈ టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *