గంగవ్వ వ్యవసాయ రంగంలో కార్మికురాలిగా పనిచేసేది. ఆమె 2016 లో యూట్యూబ్ లో ప్రవేశించే వరకు పొగాకు చుట్టలను చుట్టే కార్మికురాలిగా పనిచేసేది. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని కేంద్రీకరించే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరాం వద్ద చేరింది. అయితే వృద్ధాప్య సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యలతో ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయారు.
ఇప్పుడు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు. 2019లో వచ్చిన ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు గంగవ్వ. ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’, ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’, ‘రాజరాజ చోరా’, ‘లవ్ స్టోరీ’, ‘ఇంటింటి రామాయణం’,’ కిస్మత్’, ‘భరతనాట్యం’ తదితర సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. సిక్స్త్ సెన్స్ లాంటి టీవీ షోల్లోనూ సందడి చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గంగవ్వ తన జీవితం గురించి ఎవరకీ తెలియని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన పిల్లల గురించి ప్రశ్నించగా గంగవ్వ ఇలా సమాధానం చెప్పుకొచ్చింది.. ‘ నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోయాను. ఇక ఒంటరిగానే ఆ నరక జీవితాన్ని కొనసాగించాను. ఇక పెళ్లయ్యాక మళ్లీ పిల్లల విషయంలో ఇద్దరిని కోల్పోయాను.ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.. చిన్న వయసులోనే ఒక అబ్బాయి, అమ్మాయి చనిపోయారు.
అమ్మాయికి తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి ఆమె కూడా చనిపోయింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు గంగవ్వ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. అందరినీ నవ్వించే గంగవ్వ జీవితలో ఇన్ని కష్టలున్నాయా? అంటూ నిట్టూరుస్తున్నారు.