ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన 38 సెకన్లలో అది పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. అయితే అదే విమానంలో బతికి బయటపడిన రమేష్ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని మీడియాకు వివరించారు. అయితే అంత ఘోర ప్రమాదం తర్వాత చిన్న చిన్న గాయలతో ఒక్కడు ప్రాణాలతో బయటపడి, నడుచుకుంటూ వచ్చాడంటూ ఎవరూ నమ్మలేదు.
కానీ, అతని అదృష్టం కొద్ది రమేష్ బతికిపోయాడు. దీంతో అతని పేరు మీడియాలో, సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. మృత్యువును జయించాడు, మృత్యుంజయుడు అంటూ అంతా అతని గురించే మాట్లాడుకున్నారు. అయితే కొంతమంది ఇంత పెద్ద ప్రమాదం నుంచి కూడా ప్రాణాలతో బయటపడ్డాడంటే.. ఇంతనిది ఏ రాశి అంటూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. జ్యోతిష్యాన్ని నమ్మే వారు.. అతని రాశి, జాతకం తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే రాశి ఏంటో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి పుట్టిన తేదీ అవసరం. కానీ, రమేష్ పుట్టిన తేదీ ఏంటో ఎవరికీ తెలియదు. అయితే అతని పేరు ప్రకారం చూసుకుంటే..”విశ్వాస్ కుమార్ రమేష్” అనే పేరుకు వృషభ రాశి వస్తుంది. మొదటి పేరు విశ్వాస్ను తీసుకుంటే అతనిది వృషభ రాశిగా చెప్పుకోవచ్చు. అలాగే “రమేష్” అనే పేరు తీసుకుంటే తుల రాశి వస్తుంది.
మొదటి పేరు ప్రామాణికం కాబట్టి అతనిది వృషభ రాశి అనుకుంటే.. ప్రమాదం జరిగిన రోజు అంటే జూన్ 12, 2025న విశ్వాస్ కుమార్ రమేష్ జాతకం అతనికి అనుకూలంగా ఉంది. జ్యోతిష్యాన్ని బలంగా నమ్మేవారు.. ఆ రోజు అతని జాతకం బాగుంది కాబట్టే అతని బతికిబట్ట కట్టాడు అంటూ పేర్కొంటున్నారు.