జూన్ 12న లండన్కు వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం AI-171 అహ్మదాబాద్లోని BJ మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్పై టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడంపై విస్తృత దర్యాప్తులో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా విమానంలో ఉన్న 241 మంది మరణించారు.
మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న విదార్థులు కూడా మృతి చెందారు. అయితే జూన్ 12న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ప్రమాద స్థలంలో మహేష్ జిరావాలా కాలిపోయిన యాక్టివా స్కూటర్ కనిపించిందని, దీంతో ఆ చిత్రనిర్మాత కూడా మరణించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ప్రచారం జరిగింది.

అలాగే అతని మొబైల్ ఫోన్ చివరిగా ప్రమాద స్థలంలో ట్రాక్ అయ్యిందని, అక్కడే అది స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో మహేష్ మరణించి ఉండోచ్చన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక DNA పరీక్షలో నిర్ధారించిన తర్వాత కూడా మహేష్ జిరావాలా కుటుంబం మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. ఎందుకంటే ఇలాంటిది జరిగి ఉంటుందని వారు నమ్మలేకపోయారు. అయితే, పోలీసులు చివరకు యాక్టివా నంబర్, DNA రిపోర్ట్ వంటి బలమైన ఆధారాలను సమర్పించినప్పుడు, ఆ కుటుంబం షాక్ అయ్యింది.
మహేష్ ఇక లేడని అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది. ఎవరీ మహేష్ జిరావాలా..మహేష్ జిరావాలా నరోడా నివాసి. మ్యూజిక్ వీడియోలను తెరకెక్కించడంలో అతనికి విశేషమైన ప్రతిభ ఉంది. అంతేకాదు మహేష్ జిరావాలా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థకు CEO కూడా. మహేష్ గుజరాతీలో చాలా మ్యూజిక్ వీడియోలు చేశాడు. అంతేకాదు అతను దర్శకత్వం వహించిన ఒక సినిమా కూడా 2019లో విడుదలైంది.
మహేష్ జిరావారాకు భార్య హేతల్, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, అహ్మదాబాద్ ప్రమాదంలో ఇప్పటివరకు మొత్తం 231 DNA మ్యాచ్లు జరిగాయి . 210 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. మృతుల్లో 155 మంది భారతీయులు, 36 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ తో పాటు తొమ్మిది మంది స్థానికులు ఉన్నారు.