లంచగొండి బ్రోకర్‌కు చుక్కలుచుపించిన డ్రైవర్, లంచం అడిగినందకు ఏం చేశాడో చూడండి.

divyaamedia@gmail.com
2 Min Read

మధ్యప్రదేశ్లో రవాణా చెక్ పోస్టులకు ప్రభుత్వం గతేడాదే గుడ్ బై చెప్పినప్పటికీ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద రవాణా సిబ్బంది, దళారులు దోపిడీకి పాల్పడుతునే ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్ సరిహద్దుల గుండా ప్రయాణించే ట్రక్ డ్రైవర్లు ఈ దళారుల బెడదను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.

అయితే డిసెంబర్ 20, శనివారం మధ్యాహ్నం హనుమాన RTO చెక్ పోస్ట్ సమీపంలో ఒక బ్రోకర్ ట్రక్ డ్రైవర్ సుమిత్ పటేల్ నుండి డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. పటేల్ నిరాకరించడంతో, బ్రోకర్ కదులుతున్న ట్రక్కుపై బలవంతంగా ఎక్కాడు. ఆపడానికి బదులుగా, డ్రైవర్ దాదాపు ఐదు కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు, బ్రోకర్ వాహనాన్ని అంటిపెట్టుకుని పదే పదే ఆపమని వేడుకున్నాడు.

వైరల్ వీడియోలో బ్రోకర్ క్షమాపణలు చెప్పడం, డ్రైవర్ పాదాలను తాకి, తనను వదిలిపెట్టమని వేడుకుంటున్నట్లు చూపిస్తుంది. చెక్ పోస్టుల వద్ద బ్రోకర్లు పదే పదే వేధించడం, దోపిడీ చేయడంతో తాను విసిగిపోయానని పటేల్ తరువాత చెప్పాడు. డ్రైవర్లను మళ్ళీ వేధించనని బ్రోకర్ హామీ ఇచ్చిన తర్వాత చివరికి అతను ట్రక్కును ఆపాడు. జిల్లాలోని పలు చెక్ పోస్టుల వద్ద డాక్యుమెంట్ల తనిఖీల పేరుతో బ్రోకర్లు నిత్యం డబ్బులు వసూలు చేస్తున్నారని ట్రక్కర్లు ఆరోపిస్తున్నారు.

డ్రైవర్ ప్రవర్తన తప్పు కావచ్చు, కానీ వారు రోజువారీ అక్రమ వసూళ్లతో విసిగిపోయారని వారి సంఘం చెబుతోంది. అయితే డ్రైవర్‌ చర్యపై నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రోకర్‌ కింద పడి ప్రాణాలు కోల్పోతే ఎంటి పరిస్థితి అని కామెంట్స్‌ పెడుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *