‘ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు మాకు పర్సంటేజ్ అయితే బాగుంటుందని మాట్లాడుకున్నారు. ఒక సంవత్సరంలో 150 సినిమాలు విడుదలయితే 90 సినిమాలు అందరూ పర్సంటేజ్ విధానంలోనే ఆడుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే రెంట్ లేదా పర్సంటేజ్ బేసిస్ లో ఆడుతున్నాయి. ఇలా ఆడుతున్న సమయంలోనే కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అప్పుడే ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరిలో ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ లో పర్సంటేజ్ సిస్టం కోరుకున్నారు.
అయితే థియేటర్ల సమస్యలు, పైరసీ, పరిశ్రమలో సమన్వయం లేని వ్యవహారాలపై ఆయన ముక్తంగా స్పందించారు. ఒక ప్రొడ్యూసర్ గానే కాకుండా, ఇండస్ట్రీ పరిరక్షణకర్తగా తన బాధ్యతను వినిపించుకున్నారు. “ఇప్పటి పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే. ఎవరికేంటో వాళ్లకే తెలియాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇండస్ట్రీకి నాయకత్వం వహించే స్పష్టత లేదు. ఒకే సంఘానికి అన్నీ వదిలేయలేం. ప్రతీ సమస్యకు కలిసికట్టుగా చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఎవరికైనా తోచినట్లే మాట్లాడుతున్నారు” అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు.
దిల్ రాజు తాను నిర్మించిన గేమ్ ఛేంజర్ విషయంలో కూడా షాకింగ్ ఆరోపణ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ తొలి రోజునే పైరసీ అయింది. అది కూడా చేసింది మరో నిర్మాతే కావొచ్చు. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే.. నాకు 30 థియేటర్లు ఉన్నాయి. “దాదాపు 56 రోజులపాటు షూటింగ్లు ఆపి, మా నిర్మాతల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. కానీ దాని ద్వారా ఎలాంటి స్పష్టమైన మార్పు జరగలేదు. అసలు సాధించిందేంటో తెలీదు.
అంతటి త్యాగం తర్వాతనూ సాధించలేకపోయాం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న థియేటర్ల మూసివేత చర్చలపై స్పందిస్తూ..”థియేటర్లను మూసేస్తున్నారన్నది తప్పుడు ప్రచారం. ఇది ఇండస్ట్రీకి తలకిందుల publicity మాత్రమే. ఎగ్జిబిటర్ల కష్టాలు మాకు బాగా తెలుసు. కానీ ఒక్కరిదే తప్పు కాదుగా..! ప్రతి కోణంలో సమస్యలు ఉన్నాయి” అని వివరించారు. ఏప్రిల్ 26న గిల్డ్ మీటింగ్ జరిగింది. ఎగ్జిబీటర్ల కష్టాలన్నీ మాకు తెలుసు. ఆరు నెలలుగా వస్తున్న రెవెన్యూపై ఆరా తీశాం. రెంటే, పర్సెంటేజ్ పద్దతిలో ఆడే సినిమాలపైనే వివాదం. సినిమాలకు మొదటి వారం రెంటు ఇస్తాం. రెండో వారం నుంచి పర్సెంటేజ్ ఇస్తున్నాం.
నష్టమెందుకు వస్తుందో ఆరాతీశాం. ఏప్రిల్ 19న తూర్పు గోదావరి జిల్లా, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లోనే మాకు పర్సెంటేజ్ కావాలని ఎగ్జిబ్యూటర్లు చెప్పారు.ప్రస్తుతం అత్యధిక సినిమాలు పర్సంటేజ్ విధానంపైనే ఆడుతున్నాయి.కొన్ని సినిమాలు మాత్రమే.. రెంట్ లేదా పర్సెంటేజ్ విధానంలోనే ఆడిస్తున్నారు.ఎగ్జిబిటర్ల డిమాండ్లను డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోలేదు. తమ పర్సెంటేజ్ విధానం అమలు చేయకపోతే.. థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు అన్నారు.. అని దిల్ రాజు చెప్పాడు.