పెద్ద డైరెక్టర్ అని బిల్డప్ ఇచ్చి.. హీరో ధనుష్ ని నమ్మినందుకు నడిరోడ్డులో అడుక్కునేలా చేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న కుబేర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈసినిమా జూన్ 20 రిలీజ్ కాబోతోంది. ఈసందర్భంగా జరిగిన ప్రమోషన్స్ లో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. భవిష్యత్తులో మరిన్ని సినిమాలను ఆయన దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఈ కామెంట్స్ తో అర్ధం అవుతోంది. అయితే, ఈ మాటలు పూర్తిగా ఆయన అభిమానుల్ని ఉద్దేశించినవని స్పష్టంగా తెలియజేశారు.

అయితే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, ధనుష్, హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ముందు నుంచి ఈ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇదివరకే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే హైదరాబాద్ లో కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. అలాగే చెన్నైలో నిర్వహించిన వేడుకలో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ధనుష్ మాట్లాడుతూ.. తనను మాస్ కమర్షియల్ చేయాలని కొందరు సలహాలు ఇచ్చారని.. మరికొందరు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని చెప్పారని అన్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు చెప్పి కన్ఫ్యూజ్ చేశారని.. కానీ తన నుంచి ఎప్పుడూ ఏ రకమైన సినిమా అయినా రావచ్చని అన్నారు. ధనుష్ మాట్లాడుతూ.. “కోవిడ్ టైంలో ది గ్రే మ్యాన్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు కుబేర కథ చెప్పారు. వీడియో కాల్ లోనే 20 నిమిషాలపాటు స్టోరీ చెప్పారు. కథ నచ్చడంతో చేద్దాం అని చెప్పాను. రెండేళ్లలో కథను సిద్ధం చేశారు.

స్క్రీన్ ప్లే సమయంలో మరోసారి నాకు కథ చెప్పారు. శేఖర్ కమ్ముల గురించి నాకు తెలియదు. కానీ ఎవరికి చెప్పినా శేఖర్ కమ్ములా వావ్ అంటూ భయంకరమైన బిల్డప్ ఇచ్చారు. స్క్రిప్ట్ సూపర్ గా ఉందని.. పెద్ద డైరెక్టర్ అని నమ్మినందుకు తిరుపతి నడిరోడ్డులో అమ్మా అమ్మా అంటూ బిక్షం అడుక్కునేలా చేశారు ” అంటూ నవ్వుతూ అన్నారు ధనుష్. దీంతో అక్కడున్నవారంతా నవ్వారు. చాలా కాలం గ్యాప్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

ఇందులో ధనుష్ బెగ్గర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా దాదాపు 3 గంటల నిడివితో ఉన్నట్లు సమాచారం. అమిగోస్ సినిమాస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *