విడాకుల తర్వాత తొలిసారి కలిసిన ధనుష్, ఐశ్వర్య..! కొడుకు కోసం ఏం చేసారో మీరే చుడండి.

divyaamedia@gmail.com
1 Min Read

యాత్ర తన చదువును చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పూర్తి చేశాడు. ఈ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కు తండ్రి దనుష్, తల్లి ఐశ్వర్య ఇద్దరూ హాజరయ్యారు. ఈ ఫోటోలను ధనుష్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం విశేషం. ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమ కొడుకుని ప్రేమగా కౌగిలించుకుంటున్న దృశ్యాలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. అయితే ధనుష్ కుమారుడు యాత్ర తన పాఠశాల విద్యను పూర్తిచేశాడు.

తాజాగా పాఠశాలలో జరిగిన స్నాతకోత్సవానికి తన మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కొడుకును కౌగిలించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసి ప్రౌడ్ పేరెంట్స్ అంటూ రాసుకొచ్చారు. విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత తమ కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకలలో ఐశ్వర్య, ధనుష్ ఇద్దరూ సంతోషంగా కనిపించడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వం వహించి .. నటించిన ఇడ్లీ కడై చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా తేరే ఇష్క్ మై లో నటిస్తున్నరాు. ఆతర్వాత అమరన్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించే ఒక చిత్రంలో, లాప్పర్ బంధు దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించే ప్రాజెక్టులో నటించనున్నారు.

ఇవే కాకుండా డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించనున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ లో నటించనున్నారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *