ప్రధానమంత్రి మోదీ ‘యువగళం’ అనే కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించి, దాని మొదటి ప్రతిని స్వీకరించారు. ఈ పుస్తకం నారా లోకేష్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల చారిత్రాత్మక యువగళం పాదయాత్ర విశేషాలను వివరిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం కొనసాగింది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి మరపురాని సంఘటనగా నిలిచిపోతుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలవడం ఎంతో ఆనందంగా ఉందని, సమావేశం ఆహ్లాదకరంగా, ఆప్యాయంగా సాగిందని లోకేష్ తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు టీడీనీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను టేబుల్ బుక్లో పొందుపరిచారు.

యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి బాటలు వేసిందని చెప్పవచ్చు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ పుస్తకంపై సంతకం చేసి లోకేష్కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ ఈ సమావేశంలో కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

దేశ అభివృద్ధిలో భాగంగా 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందించేందుకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా ప్రధానిని లోకేష్ కోరారు. మోదీ, లోకేష్ మధ్య జరిగిన ముఖాముఖి సంభాషణలో వివిధ అభివృద్ధి విషయాలు,రాష్ట్ర స్థాయి ఆందోళనలను ప్రస్తావించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-బీజేపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వం అందిస్తున్న మంచి పరిపాలన గురించి మంత్రి లోకేష్ మోదీకి వివరించారు. అమరావతితో సహా వివిధ సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీకి సంబంధించిన ఇతర అంశాలను ఆయన వివరించారు.