ఖర్జూరం తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్నవారి ఖర్జూరాల్ని తినవచ్చు. అయితే ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి ముఖ్యంగా ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ B6 లలో సమృద్ధిగా ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫినాలిక్ యాసిడ్ చాలా తక్కువ.
కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, హృదయ నాళ వాపుని తగ్గిస్తుంది. ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ ఖర్జూరం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలని సులభం చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. కరిగే ఫైబర్ ఇందులో ఉండడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది.
ఆరోగ్యకరమైన గట్ సూక్ష్మజీవులని నిర్వహిస్తుంది. రోజుకి రెండు ఖర్జూరాలను తినటం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంజీరా, బాదం వంటి ఇతర పండ్లతో పోలిస్తే, ఖర్జూరంలో అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. రోజూ ఖర్జూరం తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ఖర్జూరాలని రోజూ తీసుకుంటే ఐరన్ కంటెంట్ పెరిగి రక్తహీనతని దూరం చేస్తాయి.
కానీ, ఇతర ఆహారాలతో పోలిస్తే, ఖర్జూరాలు తక్కువ గ్లైసెమిక్ సూచికని కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని తక్కువ పరిమాణంలోనే తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మెదడు పనితీరును మెరుగుపరచడంలో రోజూ ఖర్జూరం తినడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడమే కాకుండా, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.