గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని అకస్మాత్తుగా రద్దు చేయబడింది. అనంతరం మ్యాచ్ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఆటగాళ్లను కూడా వెంటనే వారి హోటళ్లకు తిరిగి పంపించారు. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో…
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన ఓ చీర్ గర్ల్ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ధర్మశాల వేదికగా గురువారం రోజున జరగాల్సిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత జమ్మూపై.. పాకిస్తాన్ దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.
ఇలాంటి నేపథ్యంలో.. మ్యాచ్ ను అర్థంతరంగా రద్దు చేశారు. స్టేడియం నుంచి ప్రేక్షకులు అందరినీ వెళ్లగొట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ కు చీర్ గర్ల్ గా వ్యవహరించిన ఓ లేడీ… సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు చాలా భయంగా ఉందని… ఇక్కడ అన్ని లైట్స్ ఆఫ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలో ఎమోషనల్ అయింది. తనకు భయం గా ఉందని… ప్రాణాలు గుప్పట్లో పెట్టుకున్నామని పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
"Very very scary" – Cheer leader's SHOCKING video from Punjab Kings Vs Delhi Capitals IPL match in Dharamshala. pic.twitter.com/S830aDKer3
— Manobala Vijayabalan (@ManobalaV) May 8, 2025