దేశంలోను కరోనా వ్యాప్తి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. అదే సమయంలో దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ తీవ్రం కాకపోయినా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో చెన్నైతో సహా పలు నగరాల్లో రెండు వారాలకు జ్వరం, దగ్గు, జలుబు, తదితర సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ రకం వైరస్ గా మార్పు చెందిందని, స్వయా జాగ్రత్తలు పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు.

అలాంటి లక్షణాలు ఉన్నవారు వారం రోజులు తమ ఇళ్లల్లోనే క్వారంటైన్ లో ఉండాలని, జ్వరం తీవ్రత అధికంగా ఉంటే ఆసుపత్రులకు వెళ్ళాలని సూచిస్తున్నారు. ఈ కరోనా కొత్త వేరియంట్ పెరుగుదలకు ప్రధాన కారణాలు చూసుకుంటే ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, ఈ కొత్త వెరియంట్కు అధిక వ్యాప్తి సామర్థ్యం కలిగి ఉండటం. ఈ రెండు కారణాల వల్ల ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కరోనా కొత్త వేరియంట్ లక్షణాలనాలు కూడా ఇంతకుముందు వచ్చిన ఒమిక్రాన్ లక్షణాల మాదిరే ఉన్నాయి.
ప్రధానంగా గొంతు నొప్పి, దగ్గు, అలసట, జ్వరం వంటి లక్షణాలుగా కనిపిస్తాయి. అయితే, ఇంతకు ముందు కరోలా లక్షణాలైన రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్లలో అంతలా గా కనిపించట్లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈకొత్త వేరియంట్ ప్రధానంగా శ్వాసకోశపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇకి కూడా సీజనల్ ఫ్లూ వ్యాదుల మాదిరే వస్తూ పోతూ ఉంటాయని.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇది మనపై ఎక్కువ ప్రభావం చూపదని చెబుతున్నారు.

అయితే ప్రజలు ఈ కొత్త వేరియంట్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తులు తీసుకోవడం ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు ముఖ్యంగా, రద్దీ ప్రదేశాలు, ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, సానీటైజర్లు వాడటం వంటివి పాటించాలంటున్నారు. అనారోగ్యంగా అనిపిస్తే కచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు ఉంటే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.