నెట్టింట బాగా పేమస్ అయిన రాజమండ్రి కేంద్రంగా పచ్చళ్ల వ్యాపారం చేసే అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్. ఓ యువతి.. అందునా స్వయం ఉపాధితో ముందుకు వెళ్తుంది. అనతికాలంలోనే తన పచ్చళ్లను బాగానే ప్రమోట్ చేసి.. మార్కెట్లో మంచిగా సక్సెస్ అయింది. కచ్చితంగా అభినందించి తీరాల్సిందే.
అయితే వీరి పచ్చళ్లకు రేట్లు ఎక్కువ అని ముందు నుంచి టాక్ ఉంది. క్వాలీటి ఉంటే రేట్లు ఉండవా అన్నది అలేఖ్య చిట్టి వెర్షన్. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన అంశాల్లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి. ఈ పేరును వినగానే నెట్టింట వినిపించే ఆడియోలు, ట్రోల్స్ గుర్తుకు వస్తాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పేరుతో పచ్చళ్లు విక్రయిస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించిన ఈ అక్కచెల్లెళ్లు ఇప్పుడు కొత్త వార్తల్లో నిలిచారు.
ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన ఈ సిస్టర్స్ ఓ దశలో కస్టమర్ల తిడుతూ స్పందించడం వల్ల విమర్శలకు గురయ్యారు. దాంతో వారి వ్యాపారం కూడా తాత్కాలికంగా మూతపడ్డట్లు తెలిసింది. అయితే ఇటీవల తిరిగి వ్యాపారం ప్రారంభించి మళ్లీ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ ఇద్దరిలో రమ్య అనే యువతి ప్రత్యేకంగా నెటిజన్లను ఆకట్టుకుంది. హాట్ అండ్ క్రేజీ రీల్స్ ద్వారా ఫాలోవర్స్ను పెంచుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయింది.
ఆమె చేసిన ప్రమోషన్ వల్లే చాలామందికి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి తెలిసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రమ్యనే ఈ బ్రాండ్కు ముఖచిత్రంగా మారింది. తాజాగా రమ్య ఓ సినిమా టీజర్ ఈవెంట్లో మెరిసింది. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే చిత్ర టీజర్ విడుదల కార్యక్రమంలో ఆమె హాజరయ్యింది. ఈ కార్యక్రమం హైదరాబాద్లో గురువారం జరిగింది. ఈ ఈవెంట్కు సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు శైలేశ్ కొలను, నిర్మాతలు కేఎస్ రామారావు, కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Aithe ayyindhi le gani…Film Industry lo All the best for Future Projects👀
— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) May 16, 2025
Career meeda focus pettindi ippudu😂🤣 pic.twitter.com/wM11A6PGoq