చిరంజీవి తల్లి అంజనా దేవీకి అస్వస్థత, అసలు ఆమె పరిస్థితి ఎలా ఉందొ తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

అంజనా దేవి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న హీరో చిరంజీవి తన షూటింగ్ పనులను పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరిగింది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా క్యాబినేస్ సమావేశం మధ్యలోనే హైదరాబాద్ కు పయనమయ్యారని పుకార్లు షికార్లు చేశాయి.

అయితే తాజాగా మెగా మాతృమూర్తి అంజనా దేవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళనకరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అస్వస్థతకు గురయ్యారని.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరిగింది. తాజాగా అంజనా దేవి ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ఆమె ఆరోగ్యం సీరియస్ అని, ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారని కొన్ని ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా వేదికలు వార్తలను వెదజల్లాయి. ఈ వార్తల తీవ్రత పెరగడంతో, మెగా బ్రదర్, నటుడు నాగబాబు రంగంలోకి దిగారు.

తన అధికారిక ట్విట్టర్ (ప్రస్తుతం X) వేదికగా స్పందిస్తూ.. “అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రస్తుతం బాగానే ఉన్నారు” అని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అంజనా దేవి ఆరోగ్యంపై వస్తున్న అనవసరపు ఊహాగానాలకు, తప్పుడు వార్తలకు తెరపడినట్లయింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *