చాలా ఏళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినిమా అవార్డు దక్కింది. ఆ అవార్డుని ఎన్టీఆర్.. చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు. ఆ తర్వాత తారక్ మాట్లాడుతూ ఈ అవార్డుని చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.
ఎందుకంటే మేమంతా చిన్నప్పటి నుంచి బాలయ్య బాబాయ్, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాలు చూస్తూ పెరిగాం. వారి నుంచే నటన, డ్యాన్సులు నేర్చుకున్నాం అని తారక్ తెలిపారు. అదే సమయంలో లెజెండ్రీ నటుడు శోభన్ బాబు మరణించడంతో ఆ విషయాన్ని తారక్ స్టేజీపైనే ప్రస్తావించారు. శోభన్ బాబు గారు మరణించడం జరిగింది.
ఆఖరి చూపు కోసం నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన శవాన్ని కూడా చూసే అర్హత నాకు ఇంకా రాలేదని అనుకుంటున్నా. అందుకే ఈ అవార్డుని ఆయనకే అంకితం ఇస్తున్నా అని చిరంజీవి ముందే తారక్ ప్రకటించారు. ఈ అవార్డుని శోభన్ బాబు కుటుంబ సభ్యులకు అందేలా చేయాలని కోరుతూ చిరంజీవి గారికే వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.
ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. ఈ అవార్డుని శోభన్ బాబు గారికి అంకితం ఇవ్వాలి అనే ఆలోచన తారక్ కి రావడం అతడి సంస్కారాన్ని సూచిస్తుంది అంటూ ప్రశంసలు కురిపించారు.
