క్యాన్సర్ అనేది శరీరంలో నిశ్శబ్దంగా పెరిగే తీవ్రమైన వ్యాధి.. కాన్సర్ పరిస్థితి తీవ్రమైనప్పుడు మాత్రమే తరచుగా గుర్తించబడుతుంది. అయితే, మీ శరీరం క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను ఇస్తుంది.. వీటిని మనం తరచుగా చిన్నవిగా పరిగణించి విస్మరిస్తాము. ఈ నిశ్శబ్ద సంకేతాలను సకాలంలో గుర్తిస్తే, చికిత్సకు అవకాశం చాలా రెట్లు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇండియన్ మెడికల్ సెక్టార్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అద్భుత విజయాన్ని సాధించింది. బ్లడ్ క్యాన్సర్ను కేవలం తొమ్మిది రోజుల్లో నయం చేయగల టెక్నాలజీని రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ వెల్లూర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కలిసి ఈ రీసెర్చ్ను నిర్వహించాయి. ఈ కొత్త థెరపీని వెల్కార్టీ అని పిలుస్తున్నారు. ఇది ఇండియాలో బయో థెరపీ సెక్టార్ పవర్ను చాటింది. ఈ సక్సెస్ లక్షలాది మంది రోగులకు తక్కువ ధరతో ఫాస్టెస్ట్ ట్రీట్మెంట్ను అందించే ఆశను రేకెత్తించింది. వెల్కార్టీ థెరపీ.. వెల్కార్టీ (Velcarti) అనే కొత్త CAR-T సెల్ థెరపీ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది.

ఈ థెరపీలో పేషెంట్ బాడీ నుంచి T-సెల్స్ను తీసుకొని ల్యాబ్లో వాటిని సరిచేస్తారు. క్యాన్సర్ సెల్స్ను నాశనం చేసేలా తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు. సీఎంసీ వెల్లూర్లోని హాస్పిటల్లోనే ఈ సెల్స్ను తయారు చేయడం ఈ రీసెర్చ్ స్పెషాలిటీ. గతంలో ఫారిన్ నుంచి ఈ సెల్స్ను ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు స్వదేశీ టెక్నాలజీతోనే చేయడంతో ఖర్చు 90 శాతం తగ్గింది. ఈ థెరపీని ‘అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ALL), లార్జ్ బీ-సెల్ లింఫోమా (LBCL)’ పేషెంట్స్పై టెస్ట్ చేశారు. ఈ రిజల్ట్స్ మాలిక్యులర్ థెరపీ ఆంకాలజీ జర్నల్లో పబ్లిష్ అయ్యాయి.

ఫాస్టెస్ట్ రిజల్ట్స్.. తొమ్మిది రోజుల్లో బ్లడ్ క్యాన్సర్ను నిర్మూలించగల ఈ థెరపీ 80 శాతం రోగులలో 15 నెలల పాటు క్యాన్సర్ లక్షణాలను పూర్తిగా తొలగించింది. ఈ క్లినికల్ ట్రయల్లో రోగుల T-సెల్స్ను ఆటోమేటెడ్ సిస్టమ్తో హాస్పిటల్లోనే మార్చారు. ఈ ప్రాసెస్ ట్రెడిషనల్ కీమోథెరపీ, రేడియేషన్ల కంటే తక్కువ బాధను కలిగిస్తుంది. ICMR ఈ థెరపీని ఫాస్టెస్ట్, చీపెస్ట్గా పేర్కొంది. ఈ సక్సెస్ ఇండియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సెల్ఫ్ సఫీషియెన్సీని పెంచింది. పేషెంట్స్కు ఫారిన్ ట్రీట్మెంట్స్పై ఆధారపడే అవసరం తగ్గింది.ఫ్యూచర్పై ఆశలు.. వెల్కార్టీ థెరపీని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ICMR, సీఎంసీ వెల్లూర్ కృషి చేస్తున్నాయి.

ఈ థెరపీని నారాయణ హాస్పిటల్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్, PGIMER వంటి ప్రముఖ హాస్పిటల్స్లో ఇంప్లిమెంట్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. ఈ టెక్నాలజీ లుకేమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల ట్రీట్మెంట్లలో మార్పులను తీసుకొస్తుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఈ థెరపీ ఖర్చు తక్కువ కావటంతో రూరల్ పేషెంట్స్కు కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ సక్సెస్ ఇండియాను క్యాన్సర్ ట్రీట్మెంట్లో ముందు వరుసలో నిలుపుతోంది. ICMR ప్రకటన..న్యూఢిల్లీలోని ICMR ఈ సక్సెస్ను క్యాన్సర్ ట్రీట్మెంట్లో మైల్స్టోన్గా అభివర్ణించింది.
ఈ ట్రయల్లో పాల్గొన్న పేషెంట్స్లో 80 శాతం మంది 15 నెలల తర్వాత కూడా క్యాన్సర్ లేకుండా ఉన్నారని ICMR ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. ఈ థెరపీ ఇమ్యూనోథెరపీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది పేషెంట్ బాడీలోని సొంత ఇమ్యూనిటీ సెల్స్ను ఉపయోగించి క్యాన్సర్తో పోరాడుతుంది. ఈ రీసెర్చ్ ఇండియాలో క్యాన్సర్ ట్రీట్మెంట్కు కొత్త డైరెక్షన్ను చూపింది.