బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ పనులు చేస్తే మీ కష్టాల నుండి విముక్తి చెందడం ఖాయం..!

divyaamedia@gmail.com
1 Min Read

తెల్లవారుజామునే తలకు స్నానం చేసి దీపారాధన చేస్తే పుణ్యఫలితాలు కలుగుతాయని చెబుతారు. కార్తీకమాసంలో శివకేశవుల అనుగ్రహం కోసమే భక్తులు పూజలు చేస్తారు. ముఖ్యంగా పరమేశ్వరుడిని అధికంగా పూజిస్తారు. అయితే కార్తీకమాసంలో కచ్చితంగా చేయాల్సిన పని నదీ స్నానం. అయితే కార్తీక మాసంలో మీరు శివనామ స్మరణ చేయడం ఉత్తమం.

ఇలా చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహం లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం కూడా చాలా మంచిది. కార్తీక మాసంలో తులసి మాతకు పూజ చేయడం మంచిది. ఈ నెలలో తులసి పూజ చేయడం ద్వారా శివుడితో పాటు విష్ణు మూర్తి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. కాబట్టి, కార్తీక మాసంలో తులసిని పూజించాలి.

తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో నిశ్శబ్ద ధ్యానం చేయడం వల్ల మీకు భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. జంతువులపై ప్రేమ కూడా చూపించాలి. అందువల్ల, కార్తీక మాసంలో, ఆవులకు పచ్చి మేత, రోటీ లేదా జంతువులు , పక్షులు తినగలిగే ఏదైనా ఇతర ఆహారాన్ని అందించాలి.

కార్తీక మాసంలో, తెల్లవారుజామున నిద్రలేవాలి. అంటే, బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి. ముందుగా స్నానం చేసి శుద్ధి చేసుకోవాలి. తర్వాత దామోదర అష్టకాన్ని భక్తితో పఠించాలి. దీనితో పాటు, ఈ సమయంలో విష్ణు నామాలను, శివ నామస్మరణ చేయాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *