అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమాన బ్లాక్ బాక్స్ ను ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత గుర్తించారు. దీనిని త్వరలో ఢిల్లీకి తరలించనున్నారు DGCA అధికారులు. విమాన ప్రమాద దర్యాప్తుల కోసం ఢిల్లీలో ఉన్న బ్లాక్ బాక్స్ ల్యాబ్లో బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించనున్నారు DGCA,AAIB అధికారులు. ప్రమాద సమయంలో ఏటీసీతో పైలెట్లు ఏం మాట్లాడారు.. ఇటువంటి పరిస్థితుల్లో విమాన ప్రమాదం జరిగింది అన్న అంశాలు వెలుగులోకి రానున్నాయి. అయితే ప్రతి కమర్షియల్ ప్లైట్లో రెండు బ్లాక్ బాక్సులుంటాయి.
ఒకటి విమానానికి ముందు భాగంలో.. మరొకటి వెనుక భాగంలో ఉంటుంది. ఇక మొదటిది ప్లైట్ డేటా, విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, కాక్పిట్ వాయిస్, పైలట్ల సంభాషణలు, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ఇక రెండో బ్లాక్ బాక్స్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో పైలట్ల కమ్యూనికేషన్, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. దీంతో ఈ రెండు బ్లాక్ బాక్సుల ద్వారా డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏమి జరిగిందో.. పైలట్లు ఏమి మాట్లాడారో.. ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు.

ఇప్పుడదే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు దర్యాప్తు అధికారులు. ఫ్లైట్ రికార్డర్, బ్లాక్ బాక్స్ 1950ల ప్రారంభంలో అభివృద్ధి చేయడం జరిగింది. బ్లాక్ బాక్స్ను ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త డేవిడ్ రోనాల్డ్ డి. మే వారెన్ కనుగొన్నారు పేలుళ్లు, అగ్ని, నీటి పీడనం, హై-స్పీడ్ క్రాష్లను తట్టుకునేలా రూపొందించడం జరిగింది. కాగా, అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన డాక్టర్ల హాస్టల్ పైకప్పుపై ఈ బ్లాక్ బాక్స్ కనుగొనట్లు సమాచారం. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది సహాయంతో, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం బ్లాక్ బాక్స్ను గుర్తించింది.
విమాన ప్రమాద దర్యాప్తుల కోసం 2025 ఏప్రిల్లోనే భారత్లో బ్లాక్ బాక్స్ ల్యాబ్ ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ల్యాబ్ను ప్రారంభించారు. ఇప్పుడా ల్యాబ్లోనే ఫస్ట్ బ్లాక్బాక్స్ను విశ్లేషించే ప్రక్రియ కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ ప్రమాదానికి దారితీసిన సంఘటనలను పరిష్కరించడానికి పరిశోధకులకు సహాయపడుతుంది. కాక్పిట్, విమాన వ్యవస్థలలో ఏమి జరిగిందో ఇది అందరికీ చెబుతుంది. ఇది క్రిమినల్ కేసుల్లో DNA సాక్ష్యం వలె పనిచేస్తుంది. సంఘటన ఖచ్చితమైన, నిష్పాక్షికమైన సాక్ష్యాన్ని అందిస్తుంది.