ఈ వారం హోస్ట్ నాగార్జున కూడా హౌస్ మేట్స్కు షాక్ ఇచ్చారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందే ప్రకటించాడు. ఇప్పటికే, శనివారం జరిగిన ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బిగ్బాస్ గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందుతుందని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు.
అయితే రన్నరప్ తో పాటు ఇతర టాప్-5 కంటెస్టెంట్స్ కు ఎంతెంత అమౌంట్ వస్తుందో మాత్రం నాగ్ చెప్పలేదు. అయితే విజేతలకు ఎంత ప్రైజ్ మనీ వచ్చినా ట్యాక్సుల రూపంలో భారీగా అమౌంట్ కట్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే విజేతలకు ప్రైజ్ మనీతో పాటు కొన్ని స్పాన్సర్స్ కంపెనీలు అందించే నగదు కానుకలు కూడా వస్తాయి.
అంటే లగ్జరీ కార్డు, గోల్డ్ ఛైన్స్ తదితరాలు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు వస్తాయన్నమాట. ఇక లేటెస్ట్ ప్రోమో విషయానికి వస్తే… గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే హౌస్లో ఎవరెవరికి ఎంతెంత ఇస్తారని కంటెస్టెంట్స్ ను అడిగాడు నాగార్జన.
దీనికి మొదట భరణి తాను గెలుచుకున్న డబ్బు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఆ లిస్ట్లో ఇమ్మాన్యుయేల్, పవన్లు ఉంటాన్నాడు. తాను గెలిస్తే రీతూ కోసం రూ. 5 లక్షలతో గిఫ్ట్ కొంటానని డిమాన్ పవన్ చెప్పారు.
#NewGuyInTown team on the Bigg Boss stage! Get ready for the fun! 🔥✨
— Starmaa (@StarMaa) December 14, 2025
Watch #BiggBossTelugu9 Mon–Fri 10:00 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/8LVfRDu9iD
