బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్..! ఓటింగ్‌లో ముందున్నా బయటకు శేఖర్ బాషా.. కారణమిదే.

divyaamedia@gmail.com
2 Min Read

అందరు అనుకున్నదానికి రివర్స్ లో శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ ను విడిచి వెళ్ళాల్సి వచ్చింది. శేఖర్ భాష పెర్ఫామెన్స్ విషయంలో ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. అంతే కాదు ఛాన్స్ వచ్చినప్పుడల్లలా హౌస్ మెంట్స్ శేఖర్ ను టార్గెట్ చేస్తూ. పెద్దగా యాక్టీవ్ గా ఉండటం లేదు అని కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇది చాలా మంది ఊహించినదే అయినా రెండో వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ హౌస్‍లో ఇతరుల కంటే కంటే కాస్తో కూస్తో ఎంటర్‌టైన్‍మెంట్, ఫన్ అందిస్తోన్న ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆదివారం (సెప్టెంబర్ 15) నాటి ఎపిసోడ్ లో శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ ఆడియెన్స్ షాక్ కు గురయ్యారు. నామినేషన్స్ లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ కంటే ఓటింగ్‍లో శేఖర్ బాషా టాప్‍లో ఉన్నాడు. అయితే అతను ఎలిమినేట్ అయ్యేందుకు ఓ బలమైన కారణం ఉంది. రెండో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. పృథ్విరాజ్, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు.

తక్కువ ఓట్లు పోలైన ఆదిత్య, సీతలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చాలా మంది భావించారు. అయితే, సడెన్‍గా శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఓటింగ్ పరంగా చూస్తే శేఖర్ బాషానే చాలా ముందు ఉన్నాడు. కానీ అతను తండ్రి అయ్యాడు. అతని భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. శేఖర్ బాషా తండ్రైన విషయాన్ని శనివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జునే వెల్లడించాడు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నామినేషన్లలో ఉన్న మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ లో చివరకు ఆదిత్య ఓం, శేఖర్‌ బాషా మిగిలారు.

ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండేందుకు అర్హులో వాళ్ల మెడలో పూలదండ వేయమని నాగార్జున కంటెస్టెంట్స్ కు సూచించారు. దీంతో గత వారం రోజుల నుంచి శేఖర్‌బాషా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని, కొడుకు పుట్టాడని సమాచారం తెలిసిన తర్వాత మరింత భావోద్వేగానికి గురవుతున్నారని హౌస్ మేట్స్ ఎక్కువ మంది ఆదిత్య ఓం మెడలో పూలదండ వేశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *