బిగ్ బాస్ కన్నడ సీజన్ లోనూ కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. అది కూడా ఓ సిల్లీ రీజన్ తో.. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 రన్ అవుతోంది. ఈ షో కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఈ వారం రఘు, సూరజ్ కిచెన్ వర్క్ తీసుకున్నారు. ధ్రువంత్, అశ్విని కూడా వంటచేస్తామంటూ పిండి ఇతర పదార్థాలను తీసుకున్నారు.
కానీ రఘుకు ఇది ఏ మాత్రం నచ్చలేదు. ధ్రువంత్ తో వాగ్వాదానికి దిగాడు. మొదట మాటలతో చిన్నగా మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఇతర కంటెస్టెంట్స్ కూడా తలదూర్చడంతో బిగ్ బాస్ హౌస్ ఒక చిన్నపాటి రణక్షేత్రంలా మారిపోయింది. ముఖ్యంగా బంగాళాదుంపల విషయంపై కంటెస్టెంట్లు గొడవ పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
‘నువ్వు ఈ రోజు బంగాళాదుంపలు తిని వాటిని ఖాళీ చేస్తే, రేపు మనం తినాలనుకున్నప్పుడు మనకు ఏమీ ఉండదు‘ అని ధ్రువంత్, అశ్విని ఆగ్రహం వ్యక్తం చేయగా.. రజత్ ‘నోరు మూసుకుని సర్దుకోండి‘ అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో ధ్రువంత్ మరింత రెచ్చిపోయాడు. అన్ని విడి విడిగా ఉంచండి.. ఎవరి వాటా వారికి పంచండి‘ అని అన్నాడు. ఇంతలో మరో కంటెస్టెంట్ కావ్య ఈ గొడవలోకి తలదూర్చింది.
అన్నిటినీ సమంగా తూకం వేసి పంచుకోవాలంది. రజత్ కూడా ఇదే విషయమై బిగ్ బాస్ కు సూచన ఇచ్చాడు. బియ్యంతో సహా కిచెన్ లో ఉన్న వంట పదార్థాలన్నింటినీ తూకం వేసి షేర్ చేయలన్నాడు. తరువాత అశ్విని, రఘు కూడా ఇదే విషయంపై తగవులాడుకున్నారు. ఇలా మొత్తానికి బంగాళాదుంపలతో మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది.
