చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. సాధారణంగా విడాకుల సమయంలో భర్తల నుంచి కోట్ల రూపాయిల భరణం డిమాండ్ చేస్తుంటారు భార్యలు. అయితే విచిత్రంగా భర్తకే భరణం చెల్లించి చరిత్ర సృష్టించింది ఓ హీరోయిన్.
అయితే బాలీవుడ్ టెలివిజన్ నటి శ్వేత తివారి ఆమె మాజీ భర్త రాజా చౌదరితో విడాకుల సెటిల్మెంట్లో భాగంగా, రూ. 93 లక్షల విలువైన బెడ్రూం ఫ్లాట్ భరణంగా ఇచ్చిందట. శ్వేత, రాజా జంట 1998లో పెళ్లి చేసుకున్నారు. కానీ, రాజా మద్యం అలవాట్లు, గృహహింస కారణంగా కలిసుండలేక విడాకులు తీసుకున్నారు.

అంతేగాక, వారిద్దరి మధ్య ఐదేళ్ల పాటు న్యాయపోరాటం సాగింది. చివరికి విడాకులు వచ్చినప్పుడు.. తమ కుమార్తె పలక్ తివారీ సంరక్షణ కోసం శ్వేత తాను ఉన్న ఆస్తిని వదులుకోవడానికే సిద్ధమయ్యారు. “నా జీవితంలో, నా కుమార్తె పలక్ కంటే గొప్పది ఏదీ లేదు. నేను సంపాదించినదంతా ఆమెకోసమే. ఒక తల్లిగా ఆమెకు మంచి భవిష్యత్తే నా లక్ష్యం.” అని శ్వేత తివారి చెప్పింది.