సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన స్టార్ హీరోయిన్, అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే పోటిగా..?

divyaamedia@gmail.com
2 Min Read

బర్ఖా మదన్.. హిందీ, పంజాబీ సినిమా నటి, నిర్మాత, మోడల్. టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించడంతోపాటు కొన్ని టీవీ షోలను కూడా హోస్ట్ చేసింది. బౌద్ధ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై 2012 నవంబరులో బౌద్ధ సన్యాసిగా తన సన్యాసాన్ని పొంది, తన పేరును వేం. గ్యాల్టెన్ సామ్‌టెన్ గా మార్చకుంది. అయితే బర్ఖా మదన్..1996లో ‘ఖిలాడియోన్ కా ఖిలాడీ’ అనే యాక్షన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ఇందులో అక్షయ్ కుమార్, రేఖ , రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కీలకపాత్రలో నటించిన బర్ఖా మదన్.. తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మరో అవకాశం అందుకోవడానికి ఆమెకు ఏడు సంవత్సరాలు పట్టింది. 2003లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన హారర్ర్ చిత్రం భూత్ లో మంజిత్ ఖోస్లా అనే భయానక పాత్రను పోషించింది.

ఈ పాత్రతో ప్రేక్షకులపై మంచి ముద్ర వేసింది. అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్, తనూజ వంటి ప్రముఖ నటులతో కలిసి బర్ఖా నటించింది. భూత్ సినిమా తర్వాత తిరిగి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 2005 నుంచి 2009 వరకు జీటీవీలో వచ్చిన సాత్ ఫేరే సలోని కా సఫర్ అనే సీరియల్లో నటించింది. 2010 లో బర్ఖా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుని గోల్డెన్ గేట్ LLC ని స్థాపించారు.

తన సొంత బ్యానర్ పై సోచ్, సుర్ఖాబ్ అనే రెండు సినిమాలను నిర్మించింది. ఆ తర్వాత 2012లో ఆమె బౌద్ధమతంలోకి మారాలని నిర్ణయించుకుంది. గత 13 ఏళ్లుగా సినీరంగానికి దూరంగా ఉంటూ సన్యాసి జీవితాన్ని గడుపుతుంది. ఆమె ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాల్లోని పర్వాతాలలో నివసిస్తుంటారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *