థియేటర్ల బంద్ వెనకాల ఉన్న ఆ నలుగురు వీళ్లే..! మెయిన్ విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

divyaamedia@gmail.com
1 Min Read

థియేటర్ల బంద్ పిలుపు వెనుక జనసేన నేత ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యనేతపై వేటు వేసింది రాజమండ్రి నగర నియోజకవర్గం జనసేన ఇంఛార్జి అత్తి సత్యనారాయణపై జనసేన వేటు వేసింది. అయితే థియేటర్ బంద్ వెనుకాల ఎవరు ఉన్న కూడా విచారణ జరపాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో జనసేన ముఖ్యనేతపై దీని వెనకాల ఉన్నట్లు బైటపడింది.

రాజమండ్రి నగర నియోజకవర్గం జనసేన ఇంఛార్జి అత్తి సత్యనారాయణపై జనసేన వేటు వేసింది. థియేటర్ల బంద్ పిలుపు వెనుక ఈయన హస్తముందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అత్తి సత్యనారాయణ పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేసింది.ఈ క్రమంలో అత్తి సత్యనారాయణ ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 23వ తేదీన మంత్రి కందుల దుర్గేష్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని థియేటర్ బంద్ వెనుకాల ఉన్న కుట్రదారులు..ఆ నలుగురు ఎవరు అని అడిగారు.

అయితే.. బంద్ కు తెర లేపింది దిల్ రాజు అని చెప్పినట్లు నిజం బైటపెట్టారు. అందుకే తనను బలిపశువును చేశారన్నారు. ఈ క్రమంలో దిల్ రాజ్ తనను అన్యాయంగా ఇందులో ఇరికించాడని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారని చెప్పుకొచ్చారు. ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకునేందుకు దిల్ రాజు నా పేరు చెప్పి,గొడవను డైవర్ట్ చేసినట్లు చెప్పారు.

తాను.. థియేటర్ల బంద్ అని ఎక్కడా అనలేదని.. అత్తి సత్యనారాయణ స్పష్టంచేశాడు. రాజు పై కోర్టుకు వెళ్తానని, నా రాజకీయ భవిష్యత్ పై దెబ్బ కొట్టిన దిల్ రాజును వదిలేదని లేదని అత్తి సత్యనారాయణ సంచలనవ్యాఖ్యలు చేశాడు. థియేటర్ బంద్ వెనుకాల.. దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునిల్ నారంగ్ ఉన్నారని మాట్లాడారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *