వామ్మో, రూ.10 లక్షలకు అమ్ముడైన ఆవు, దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.

divyaamedia@gmail.com
2 Min Read

ఆవును ఏకంగా రూ.10 లక్షలకు రామిరెడ్డి దగ్గర నుంచి అమిత్‌కిషన్ కొనుగోలు చేశారు. అంతేకాదండోయ్ ఈ ఆవుకు మరో ప్రత్యేకత ఉంది.. ఈ గోమాత ఉదయం, సాయంత్రం 8 లీటర్ల చొప్పున మొత్తం 16 లీటర్లు పాలు ఇస్తుందని చెబుతున్నారు. పూర్తీ వివరాలోకి వెళ్తే సాధారణంగా ఓ ఆవు ధర ఎంతుంటుంది.. రూ.10 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంటుంది. బాగా పాలిచ్చే ఆవు అయితే రూ.60 వేల ధర పలుకుతుంది. కానీ, ఈ ఆవు ఏకంగా రూ.10 లక్షల ధర పలికింది.

అంత ధర పెట్టి ఆ ఆవును ఎందుకు కొన్నారు? దాని ప్రత్యేకత ఏంటి? ఇంతకీ రూ.10 లక్షలు చెల్లించి ఆ ఆవును కొన్న వ్యక్తి ఎవరో ఏంటో ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురంలో గుమ్మి రామిరెడ్డి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ​నుంచి నాలుగున్నరేళ్ల క్రితం రెండు గిర్​ జాతి ఆవులను తెప్పించి గోశాల ప్రారంభించారు. అలా ప్రారంభించిన ఆ గోశాల బాగా అభివృద్ధి చెందింది.

ప్రస్తుతం రామిరెడ్డి గోశాలలో 132 గిర్​ జాతి ఆవులు ఉన్నాయి. అయితే.. ఆయన రూ.10 లక్షలకు అమ్మిన ఆవు ఉదయం 8 లీటర్లు, సాయంత్రం 8 లీటర్ల చొప్పున మొత్తం ఒక రోజులో ఏకంగా 16 లీటర్ల పాలు ఇస్తుంది. ఆవులు ఇన్ని లీటర్ల పాలు ఇవ్వడం అరుదు. గేదెలు అయితే అలా ఇస్తాయి. అయితే.. రోజుకు 16 లీటర్ల పాలు ఇచ్చే ఈ ప్రత్యేకమైన గిర్‌ జాతి ఆవును తాజాగా ఏపీకి చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు. ఆవు కోసం ఆయన రూ.10 లక్షలు ధర చెల్లించారు.

ఏపీలోని సత్యసాయి జిల్లాలోని పెనుగొండకు చెందిన హెబ్బేవ్ గోశాల నిర్వాహకుడు అమిత్ ​కిషన్ ఈ ఆవును రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఆదివారం ఈ ఆవును వాహనంలో పెనుగొండకు తరలించారు. మరి ఇంత భారీ ధర పలికిన ఈ ఆవు ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *