ఆషాఢ మాసంలో అత్తా కోడలు ఎందుకు దూరంగా ఉండాలి..? అసలు రహస్యం ఇదే..!

divyaamedia@gmail.com
1 Min Read

బార్యాభర్తలే కాకుండా ఈ ఆషాఢ మాసంలో అత్తా కోడళ్లు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. అసలు ఈ సాంప్రదాయం కొనసాగడం వెనుక కారణం కూడా ఉంది. చాలావరకు వివాహాలు మాఘ, వైశాఖమాసంలో జరుగుతాయి. వైశాఖమాసం అంటే చెప్పనవసరం లేదు. అయితే కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాడమాసంలో విడి విడిగా ఉండాలన్న ఆచారం అమలవుతుంది. దీనికి కొన్ని సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి.

ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించి భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టటం అచారంగా వస్తుంది. అనారోగ్య మాసం ఆషాడంగా చెప్తారు.

వర్షాలు పడి కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం ఉంది. అంటే పెళ్ళయిన తొలి ఆషాఢ మాసంలో అత్తా,కోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్ధం.

కాని సామాజికంగ ,చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఆషాడంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవనే నమ్ముతారు. ఆషాడమాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *