పరేషన్ సిందూర్‌పై మహిళా అధికారునే వివరణ ఎందుకు ఇచ్చారో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఆర్మీ మహిళ అధికారి కల్నర్ ఖురేషీ, ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్‌తో కలిసి విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాక్ నీచత్వాన్ని ఎండగట్టారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గ ధామంగా మారిందని అన్నారు. బాధ్యతాయుత రీతిలో భారత్ దాడులు చేసిందని అన్నారు. పౌరులకు హాని జరగకుండా పాక్ ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. స్వీయ రక్షణ తమ హక్కు అని కూడా తెలిపారు. అయితే పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు పురుషులను చంపడంతో మహిళలు వితంతువులుగా మారారు.

వారి గౌరవార్థం.. ఆపరేషన్ ‘సిందూర్’ పేరుతో ప్రతీకార దాడులు చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను మహిళా అధికారులే తెలియజేయడం కూడా ఆపరేషన్ ‘సిందూర్’లో భాగమని తెలుస్తోంది. పాకిస్తాన్ పుట్టించిన ఉగ్రవాద కర్మాగారాలు ఏ విధంగా లక్ష్యం చేయబడ్డాయో వారు వెల్లడించారు. పాకిస్తాన్‌లో ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు ఆమె ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని వ్యోమిక సింగ్ అన్నారు.

కల్నల్ సోఫియా ఖురేషి ప్రస్తుతం లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. కాగా వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కల్నల్ సోఫియా ఖురేషి ఉత్తమ నాయకురాలిగా పేరు గడించారు. ఆమె పూణేలో నిర్వహించిన ‘ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18’ అనే అంతర్జాతీయ సైనిక విన్యాస కార్యక్రమంలో భారత బృందానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. మరోవైపు వింగ్ కమాండర్‌ వ్యోమికా సింగ్‌కు చిన్ననాటి నుంచే విమానాలపై ప్రేమతో భారత సైన్యంలో చేరాలని కోరిక ఉండేదట.

ఆమె ప్రస్తుతం హెలికాప్టర్ పైలట్‌గా పని చేస్తున్నారు. ప్రమాదరకర ప్రాంతాల్లోనూ విమానాలను నడిపిన అనుభవం ఆమెకు ఉంది. ఇప్పటి వరకు ఆమెకు సుమారు 2,500 గంటలకుపైగా విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. ఈశాన్య భారత రాష్ట్రాలతో పాటూ జమ్మూ కాశ్మీర్ లాంటి కఠినమైన వాతావరణాల్లో ఆమె చేతక్, చీతా తరహా హెలికాప్టర్లను నడిపి రికార్డ్ సృష్టించారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *