బయట వ్యక్తులతో ఏ.ఆర్.రెహమాన్, మణిరత్నం ఎందుకు తక్కువ మాట్లాడుతారో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

మణిరత్నం తమిళ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితం అయిన కథానాయక సుహాసిని మణిరత్నం భార్య. అయితే రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. అయితే సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్, దర్శకుడు మణిరత్నం 30 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నారు.

కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ‘థగ్ లైఫ్’ జూన్ 5న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో ఏ.ఆర్. రెహమాన్ తాను ఎందుకు తక్కువగా మాట్లాడతారో, మణిరత్నం, కమల్ హాసన్ తో స్నేహం గురించి చెప్పారు. మేము పని మీదే ఎక్కువ దృష్టి పెడతాం. పనికి సంబంధించినవే మాట్లాడుకుంటాం.

పెద్దలు నాకు నేర్పిన పాఠమిది. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇది నా జీవితంలో భాగమైపోయింది. మణిరత్నంతో నేను ఎక్కువగా మాట్లాడను. సినిమాల గురించే మాట్లాడుకుంటాం. సన్నివేశాలు చూస్తాం. మా సంభాషణలు చాలా చిన్నవిగా ఉంటాయి. నేను కొత్త టెక్నాలజీ వాడితే మణిరత్నం ‘ఇదంతా ఎలా చేస్తున్నావ్’ అని అడుగుతుంటారు. ‘థగ్ లైఫ్’ మణిరత్నం దర్శకత్వంలో, కమల్ హాసన్ కథతో వచ్చిన సినిమా.

సినిమాలో సింబు, త్రిష, అపిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, నాజర్, అలీఫజల్ నటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ‘నాయకుడు’ తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేసిన సినిమా ఇది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *