అల్లు అరవింద్‌కు బిగ్ షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, కూల్చేస్తాం అంటూ నోటీసులు రావడంతో..!

divyaamedia@gmail.com
1 Min Read

అల్లు కుటుంబం.. జూబ్లీహిల్స్‌లో నిర్మించిన అల్లు బిజినెస్ పార్క్‌ భవనంలో.. తాజాగా పెంట్‌హౌస్ నిర్మించారు. అయితే దీని నిర్మాణం కోసం అనుమతులు తీసుకోనట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారు అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో తెలుపుతూ వివరణ ఇవ్వాలని కోరారు. అయితే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఒక నోటీసు బయటకు రావడంతో, ఇది ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో అల్లు అరవింద్ నిర్మించిన “అల్లు బిజినెస్ పార్క్” ఉందని తెలిసిందే. ఈ భవనానికి అధికారుల నుంచి కేవలం నాలుగు అంతస్తులకే అనుమతి లభించిందని సమాచారం. అయితే, అధికారుల ప్రకారం అనుమతిని మించి ఒక పెంట్ హౌస్ కూడా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీని పైగా, జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవలే అల్లు అరవింద్‌కి ప్రత్యేక నోటీసులు పంపారు.

అనుమతి లేకుండా నిర్మించిన ఈ అదనపు పెంట్ హౌస్‌ను వెంటనే కూల్చివేయాలంటూ, లేకపోతే ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే, ఈ భవనం అనుమతులు, నిర్మాణాలపై సర్వే జరిపిన తర్వాత అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో అల్లు ఫ్యామిలీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఎందుకంటే, ఇదే సమయంలో అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప-2” విడుదలను చుట్టూ కూడా గతంలో కొన్ని వివాదాలు చెలరేగాయి. తెలంగాణ ప్రభుత్వం, సినీ నిర్మాణ సంస్థల మధ్య కొన్ని విభేదాలు తలెత్తడం అప్పట్లో పెద్ద హడావుడికి దారితీసింది. ఇప్పుడు మళ్లీ అల్లు అరవింద్ భవనం విషయం బయటకు రావడంతో, ఇది ఉద్దేశపూర్వకమా లేక నిజంగానే నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న చర్చలు జరుగుతున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *