బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం పీక్స్ కు చేరింది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురీ, పచ్చళ్ల పాప రమ్య బిస్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత.. మరింత మసాలా ఘాటు ఎక్కువైంది. అయితే తనూజను ఫేక్ పిల్ల అని తిట్టిన రమ్య కల్యాణ్ ను అమ్మాయిల పిచ్చోడు అని ముద్ర వేసేసింది. దీనిపై నాగార్జున కూడా సీరియస్ అయ్యాడు.
ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్ లో హైపర్ ఆది కూడా రమ్యకు కొన్ని మంచి టిప్స్ ఇచ్చాడు. కానీ వీటిని కూడా నెగెటివ్ గా తీసుకుంది సోషల్ మీడియా సెన్సేషన్. ఈ కారణంగానే ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటినప్పటికీ ఆడియెన్స్ ఓటింగ్ లో వెనకపడిపోయింది పచ్చళ్ల పాప. నామినేషన్స్ లో నిలిచి రెండో వారమే ఎలిమినేట్ అయ్యింది.

మొత్తానికి బిగ్ బాస్ కు రాక ముందు సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీని మూటగట్టుకుంది రమ్య మోక్ష. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు తన ఆటతీరుతో దానిని మార్చేసుకుంటుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. పైగా మరిన్ని విమర్శలను, నెగెటివిటీని మూట గట్టుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.
అయితే బిగ్ బాస్ ద్వారా రమ్యకు భారీగానే రెమ్యునరేషన్ అందిందని సమచారం. ఆమెకు వారానికి సుమారు రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకు గానూ రమ్య మోక్ష దాదాపు రూ.4 లక్షల మేర అందుకున్నట్లు సమాచారం.
