అక్షయ్ కుమార్ కి సంబంధించిన కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. హీరోకి ఏమైందని టెన్షన్ పడుతున్నారు. అక్షయ్ కుమార్ కారు ఆటోని ఢీ కొట్టింది. కానీ అందులో ఆందోళన చెందే విషయం లేదు. ఎందుకంటే ఆ కారులో హీరో లేరు.
అయితే అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో విమానాశ్రయం నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జుహులోని గాంధీగ్రామ్ రోడ్ ఇస్కాన్ టెంపుల్ ప్రాంతంలో వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు ఒక ఆటోరిక్షాను ఢీకొట్టింది. ఆ ఘటనలో ఆటో రిక్షా తీవ్రంగా ధ్వంసమైంది. అలాగే ఈ ఘటనలో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే, సంఘటన స్థలంలో గందరగోళం చెలరేగింది.
ఈ ప్రమాదంలో ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసమైంది. ఆటో రిక్షా డ్రైవర్, ప్రయాణీకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిద్దరిని వెంటనే సమీపంలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటన గురించి సమాచారం అందుకున్న ముంబై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా అధికారిక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కానీ పోలీసులు మెర్సిడెస్ డ్రైవర్ను ప్రశ్నిస్తున్నారు.
అయితే, ఈ విషయంపై అక్షయ్ కుమార్ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రమాదం జరిగిన కారు అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనం అని భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి, వీటి వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అక్షయ్ కుమార్ నటిస్తోన్న వెల్కమ్ టు ది జంగిల్ మూవీ ఈ ఏడాది విడుదల కానుంది.
