వామ్మో, రాజమౌళికి కోపం వస్తే ఎలా ఉంటుందో చుడండి, వైరల్ వీడియో.

divyaamedia@gmail.com
1 Min Read

రాజమౌళి..మహేష్ బాబుతో ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఈ సినిమాని రామ్ చరణ్ తో చేయాల్సింది కానీ బ్యాక్ టు బ్యాక్ రామ్ చరణ్ తో సినిమా చేయడం ఇష్టం లేక రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబుని తీసుకున్నట్టు కూడా వార్తలయితే వస్తున్నాయి. అయితే టాలీవుడ్‌ మూవీ మత్తువదలరా 2 విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీసింహా హీరోగా నటించారు. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళిని కలిసి కాస్తా భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఇందులో భాగంగా రాజమౌళి వద్దకు వెళ్లిన మత్తువదలరా టీమ్‌ ఎస్ఎస్ఎంబీ29 గురించి అప్‌డేట్‌ అడిగారు. దీంతో కోపానికి గురైన రాజమౌళి పెద్ద కర్ర చేతపట్టుకుని.. అప్‌డేట్ కావాలా అంటూ వారిని కొట్టేందుకు యత్నించారు. అయితే ఇదంతా కేవలం సరదాగా చేశారు. మత్తువదలరా-2 ప్రమోషన్స్‌ కోసం ఇలా వెరైటీగా ట్రై చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలవుతోంది.

ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం మత్తువదలరా 2. ఈ మూవీని రీతేష్‌ రానా దర్శకత్వంలో తెరకెక్కించారు. 2019లో వచ్చిన మత్తువదలరా-2 చిత్రానికి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ కాగా.. ప్రభాస్, రాజమౌళి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *