ఈ యాచకుడు నిజంగానే కోటీశ్వరుడు, 3 మేడలు, కారు, వడ్డీ వ్యాపారం.. అయినా రోడ్లపై అడుక్కుంటునే..!

divyaamedia@gmail.com
2 Min Read

రోజూ అందరు ఇచ్చే ముష్టి డబ్బులతో ఓ బిచ్చగాడు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు.ఇళ్లు, వ్యాపారాలకు అద్దెకివ్వడానికి షాపింగ్ కాంప్లెక్స్‌లు కూడా కట్టాడు.మధ్యప్రదేశ్‌లో ఇండోర్ వీధుల్లోని సరాఫా ప్రాంతంలో సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్న ఒక యాచకుడు ధనవంతుడిగా మారాడు. అతనికి మూడు ఇళ్ళు, ఒక కారు, మూడు ఆటో రిక్షాలు ఉన్నాయి. ఆ యాచకుడిని మంగీలాల్‌గా గుర్తించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న భిక్షాటన నిర్మూలన ప్రచారంలో భాగంగా మంగీలాల్‌ను రక్షించింది. అతని నిజమైన గుర్తింపు తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.

సరఫా వీధుల్లో చెక్క బండి, వీపు మీద బ్యాగు, చేతుల్లో బూట్లు వేసుకుని తిరిగే మంగీలాల్ అందరి సానుభూతిని పొందాడు. అయితే మాంగీలాల్‌ వివరాలను సేకరించిన అధికారులు అతడి ఆస్తులు చూసి షాక్ అయ్యారు. శారీరక వైకల్యం ఉన్న ఈ కోటీశ్వరుడి వద్ద ప్రభుత్వ కేటాయింపుతో వచ్చిన ఇల్లు సహా 3 ఇళ్లు, 3 ఆటోరిక్షాలు, మారుతీ సుజుకి డిజైర్ కారు ఉన్నాయి. ఇళ్లలో ఒకటి మూడు అంతస్తుల భవనం. మిగతా 2 ఒక అంతస్తు ఇళ్లు. ఆటోరిక్షాలు, కారును అద్దెకు ఇచ్చేవాడు. కొన్నేళ్లుగా మాంగీలాల్‌ ఇనుప బండిపై మౌనంగా కూర్చొని భిక్ష అడుక్కుంటున్నాడు.

మాంగీలాల్ నోరు తెరిచి అడగకపోయినా అతడు అమాయకంగా పెట్టే ముఖాన్ని చూసి ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తారు. భిక్ష ద్వారా అతికి రోజుకు 400 నుంచి 500 రూపాయలు వచ్చేవి. కానీ, అసలు వ్యాపారం రాత్రి తర్వాత మొదలవుతుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. భిక్షగా వచ్చిన డబ్బును జీవనానికి ఖర్చు చేయలేదని మాంగీలాల్ విచారణలో ఒప్పుకున్నాడు. ఆ డబ్బును తిరిగి పెట్టుబడిగా పెట్టేవాడు. స్థానిక వ్యాపారులకు ఒక రోజు లేదా ఒక వారం గడువుకు నగదు అప్పుగా ఇచ్చి వడ్డీ వసూలు చేసేవాడు. ప్రతిరోజూ సాయంత్రం వచ్చి వడ్డీ తీసుకునేవాడు.

అధికారుల అంచనా ప్రకారం అతడు 4 నుంచి 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి రోజుకు 1,000 నుంచి 2,000 రూపాయలు ఆదాయం పొందేవాడు. ఇందులో వడ్డీ ఆదాయం కూడా ఉంది. డినేశ్ మిశ్రా మహిళా శిశు అభివృద్ధి అధికారి, రక్షణ ఆపరేషన్ నోడల్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మాంగీలాల్‌ను ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించారు. అతడి బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై విచారణ సాగుతోంది. అతడి నుంచి డబ్బు తీసుకున్న వ్యాపారులను కూడా ప్రశ్నించనున్నారు. మాంగీలాల్‌ 2021-22 నుంచి భిక్ష అడుగుతున్నాడు. ప్రస్తుతం అతడిని ఆశ్రయ గృహంలో ఉంచారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించారు. తదుపరి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటారని మిశ్రా తెలిపారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *