సాధారణంగా వ్యక్తిగత లోన్ ఇచ్చే సమయంలో బ్యాంకులు లబ్ధిదారులకు చెందిన ఎలాంటి ఆస్తులను సెక్యూరిటీ కింద పరిగణించరు. అంటే.. రుణగ్రహీత మరణించాక మిగిలిన అప్పు రాబట్టుకొనేందుకు బ్యాంకులు అతడి ఆస్తులు జప్తు చేసుకునే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ తమ ఆర్ధిక అవసరాల కోసం రుణాలు అనేవి తీసుకుంటూ ఉంటారు.
సొంతిల్లు నిర్మించుకోవడానికి హోమ్ లోన్, వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్, కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకుంటే వెహికల్ లోన్, పెళ్లి కోసం మ్యారేజ్ లోన్, చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్, వ్యాపారం కోసం బిజినెస్ లోన్ వంటివి చాలా ఉన్నాయి. బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేసేందుకు ఎగపడుతున్నాయి. తమ వ్యాపారం కోసం కస్టమర్లకు ఫోన్ చేసి మరీ లోన్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాయి. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి మధ్యలో మరణిస్తే ఆ సొమ్ము ఎవరు చెల్లించాలి అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది.

పర్సనల్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్. లోన్తో పాటు బ్యాంకులు లోన్ ఇన్యూరెన్స్ కూడా ఆఫర్ చేస్తాయి. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ లోన్ సదరు ఇన్యూరెన్స్ కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ఇన్యూరెన్స్ ఉన్నా, లేకపోయినా కుటుంబసభ్యులపై భారం అనేది ఉండదు. ఒకవేళ రుణ గ్రహీత పేరుపై ఏమైనా ఆస్తులు ఉంటే వాటిని బ్యాంకులు తీసుకోవచ్చు. లోన్కి సరిపడ సొమ్మును తీసుకుని మిగతా సొమ్మును వారసులకు అప్పగించాల్సి ఉంటుంది.
ఒకవేల కో -అప్లికేంట్, గ్యారెంటర్ ఉంటే వాళ్లే లోన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక కో-అప్లికేంట్, గ్యారెంటర్ లేనప్పుడు కుటుంబసభ్యులకు బ్యాంక్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. కానీ కుటుంబసభ్యులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇటువంటి సమయాల్లో బ్యాంకులు రుణాలను మాఫీ చేస్తూ ఉంటాయి.
