టాలీవుడ్‌లో తీవ్ర విషాదం. సినిమా దర్శకుడు ఆకస్మిక మృతి!

divyaamedia@gmail.com
1 Min Read

‘కేడి’ సినిమా తర్వాత దర్శకత్వానికి సుదీర్ఘ విరామం తీసుకున్న కేకే, దిగ్గజ దర్శకుడు మణిరత్నం వద్ద సహాయకుడిగా కొనసాగారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టి శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి హీరోలుగా ‘కె.జె.క్యూ’ సినిమాను ప్రారంభించారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది.

అయితే టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ కన్నుమూశారు. బుధవారం ఆయన మరణించినట్లు ‘ కింగ్ జాకీ క్వీన్ ’ సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఆయన మరణానికి గల కారణాలు వెల్లడించలేదు. ఈ డైరెక్టర్ హఠాన్మరణం పట్ల సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవ‌ల అనారోగ్యంతో హ‌స్పిట‌ల్‌లో చేరిన ఆయ‌న‌కు శ‌స్త్ర చికిత్స చేయ‌గా.. అది కాస్త‌ విఫ‌లం అవ‌డంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడ‌ని స‌మాచారం. 2010లో నాగార్జున హీరోగా వ‌చ్చిన కేడీ (Kedi) సినిమాకు కిర‌ణ్‌ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఆ సినిమా ఆశించిన మేర సక్సెస్ కాకపోవడంతో చాలా కాలం పాటు తెర‌మ‌రుగ‌య్యారు.

15 ఏండ్ల త‌ర్వాత రీసెంట్ గా రీ ఎంట్రీ ఇస్తూ కేజేక్యూ (KJQ)- కింగ్ జాకీ క్వీన్ అనే చిత్రాన్ని రుపొంసితున్నారు. అది త్వ‌ర‌లో ఈ సినిమా విడుద‌ల‌ కానుండగా.. ఆయన హఠాన్మరణం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *